కేటీఆర్‌కు శస్త్రచికిత్స | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌కు శస్త్రచికిత్స

Published Sat, Apr 19 2014 2:16 AM

కేటీఆర్‌కు శస్త్రచికిత్స - Sakshi

సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ శాసనసభ్యుడు కె.తారక రామారావుకు కిడ్నీలో రాళ్లను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. గురువారం సాయంత్రం సిరిసిల్లలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కేటీఆర్ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం వెంటనే ఆయనను హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. కిడ్నీలో రాళ్లు ఉన్నట్టుగా గుర్తించడంతో శుక్రవారం ఉదయం ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. ఊపిరితిత్తుల్లోనూ నీరు చేరినట్టుగా వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు కేటీఆర్‌కు సూచించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement