సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీ సమస్య కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకే సంబంధించినది కాదనే విషయం కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని ఆంధ్రప్రదేశ్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. కృష్ణా పరివాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలనూ భాగస్వాములు చేసి జలాల పంపిణీపై నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది. కృష్ణా జలాల పంపిణీలో బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తమకు న్యాయం చేయలేదని, జలాల పంపిణీ ప్రక్రియకు మళ్లీ ప్రారంభించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన విషయం విదితమే.
దానిపై ఏపీ అభిప్రాయాన్ని కోరుతూ కేంద్రం ఇటీవల లేఖ రాసింది. కేంద్రానికి జవాబు చెప్పే విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సోమవారం జలసౌధలో ‘సాంకేతిక సలహా సంఘం’ భేటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సాగునీటి శాఖ ఇంజనీర్లతో పాటు అదనపు అడ్వొకేట్ జనరల్ డి.శ్రీనివాస్ కూడా హాజరయ్యారు. సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు ఇవీ..
* కృష్ణా జలాల కేటాయింపు సమస్య కేవలం ఏపీ, తెలంగాణకు సంబంధించిందే కాదు. మహారాష్ట్ర, కర్ణాటకలను కూడా భాగస్వాములను చేయాలి.
* బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ వాదనలు జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీకి ఎగువన తెలంగాణ ఏర్పాటైంది. దిగువ రాష్ట్రంగా ఏపీ హక్కులను పరిగణనలోకి తీసుకోవాలి. తాజా వాదనలూ వినాలి.
* బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ను పొడిగించిన నేపథ్యంలో.. మళ్లీ అన్ని రాష్ట్రాల వాదనలు విని నీటి పంపిణీ మీద కొత్తగా నిర్ణయం తీసుకొనేలా కేంద్రం ఆదేశించాలి. లేదంటే.. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి.
కేంద్రానికి సీఎస్ ద్వారా లేఖ
సాంకేతిక సలహా సంఘంలో వ్యక్తమైన అభిప్రాయాలను అదనపు అడ్వొకేట్ జనరల్ ద్వారా సీనియర్ న్యాయవాది గంగూలీకి పంపించనున్నారు.మార్పులు అవసరమని భావిస్తే మరోసారి ఈ సంఘం సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది. ఆ లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ద్వారా కేంద్రానికి పంపిస్తారు.
‘కృష్ణా’ సమస్య నాలుగు రాష్ట్రాలది
Published Tue, Jun 30 2015 4:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement