► కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
► సౌకర్యాల కల్పనలో ఎక్కడా రాజీ పడొద్దు
► అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలి
► జూన్ చివరినాటికి పనులు పూర్తవ్వాలి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : కృష్ణా పుష్కరాల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ టికె.శ్రీదేవి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె రెవెన్యూ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్తో కలిసి కృష్ణా పుష్కరాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆగష్టులో నిర్వహించనున్న కృష్ణా పుష్కరాలకు ఆయా శాఖల ద్వారా చేపట్టే పనులను జూన్ చివరి నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతి పుష్కర ఘాట్కు ఒక ప్రత్యేక అధికారిని పర్యవేక్షణ కోసం నియమిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో జాతీయ రహదారి ఉన్నందు వల్ల పుష్కరాలకు ఇతర ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు రానున్నందున ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఎలాంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని సూచించారు. మౌళిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు.
పుష్కరఘాట్ల ప్రాముఖ్యతను, దేవాలయాల ప్రాముఖ్యతను తెలిపేలా కరపత్రాలు, ఫొటోలను సేకరించాలని సూచించారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే అన్నిపనులు సవ్యంగా జరుగాతాయని అన్నారు. అలాగే పుష్కరాలపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ఎస్పీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ పుష్కరాకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా దూరదృష్టి ఆలోచించి చర్యలు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా సర్వీసు రోడ్స్ ముందే పూర్తిచేస్తే బాగుంటుందని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం.రాంకిషన్, అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, డ్వామా పీడీ దామోదర్రెడ్డి, డీపీఓ వెంకటేశ్వర్లు, మాడ పీఓ వెంకటయ్య, జిల్లా అధికారులు రామ్కోటారెడ్డి, జోత్స్న, రమణారాజు, సోమిరెడ్డి, రాజేందర్, డీఎస్పీలు, ఆర్డీఓలు పాల్గొన్నారు.
‘పాలమూరు’ ఎత్తిపోతలలో నిర్లక్ష్యం వద్దు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ శ్రీదేవి చెప్పారు. లక్ష్యానికి అనుగుణంగా పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో తహసీల్దార్లు, ఆర్డీఓలు, ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భూసేకరణ ప్రక్రియను వేగంగా నిర్వహించాలని, రిజిస్ట్రేషన్లను త్వరితగతిన పూర్తిచేసేలా చూడాలని ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో ఎక్కడా నిర్లక్ష్యం ప్రదర్శించొద్దని చెప్పారు. ఈ సమావేశంలో జేసీ రాంకిషన్, డ్వామ పీడీ కె.దామోదర్రెడ్డి, డీపీఓ వెంకటేశ్వర్లు, పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇంజనీర్లు, తహసీల్దార్లు, ఆర్డీఓలు పాల్గొన్నారు.
పుష్కరాల పనులు పూర్తి చేయాలి
Published Thu, Apr 7 2016 5:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగనన్న వెంట ఆ ఇంటి ఆడపడుచు లేకున్నా..మేము ఉన్నాం..
ఓటరు జాబితాలో పేరు తొలగించినా ఓటేయవచ్చు !
ఒకసారి తిరిగి చూసుకోండి..
పార్టీలు మారుతున్న అభ్యర్థులు.. ఎంపీలను మార్చేస్తున్న ఓటర్లు!
అలాంటి పాటలంటే నాకు ఇష్టం లేదు.. కానీ: సుకుమార్
వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
రాయల్స్పై గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో ఢిల్లీ!
SRH Vs LSG: ప్లే ఆఫ్స్ రేసు.. రెండింటికీ కీలక మ్యాచ్
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం.. మండిపడ్డ బీజేపీ
ఇదే మరి మ్యాజిక్ అంటే.. 'జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్'
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్గా కరీనా : భావోద్వేగం
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement