హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ విమర్శలపై తెలంగాణ ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. దేశంలో అవినీతికి మారుపేరు అయిన కాంగ్రెస్ స్కామ్ల పార్టీ... స్కాంగ్రెస్ అంటూ ఆయన ధ్వజమెత్తారు. శుక్రవారం కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పీకలలోతు అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి తమను విమర్శించే అధికారం లేదన్నారు. దిగ్విజయ్ బాధ్యతారాహిత్యంగా పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.
వాటర్ గ్రిడ్పై దిగ్విజయ్ చేసిన ఆరోపణలు అవాస్తవమని కేటీఆర్ అన్నారు. పాతళంలోని తీసే బొగ్గు నుంచి ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్ వరకూ దేశంలో ఏ రంగాన్ని కాంగ్రెస్ పార్టీ వదిలి పెట్టలేదని, అందినకాడికి దోచుకుందని ఆయన విమర్శించారు. మీరు చేసిన పనే...మేం చేస్తామనుకోవడం సరికాదని కేటీఆర్ అన్నారు. జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ పార్టీలాగా అవినీతికి పాల్పడలేదని కేటీఆర్ అన్నారు. క్రీడారంగంలో ప్రపంచం ఎదుట దేశం పరువు తీసింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు.
రాహుల్ గాంధీలా ప్రజాక్షేత్రం వదిలిపెట్టే సంస్కృతి తమది కాదన్నారు. కుటుంబ పాలన గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్కు లేదని... కాంగ్రెస్ నేతలు కుటుంబ పాలన గురించి మాట్లాడితే అది పెద్ద జోక్ అవుతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మీదో పార్టీ...మీదో బతుకు..దరిద్రపు ఆలోచనలు...దౌర్భాగ్యపు మాటలు అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి తీరుతామని, హైదరాబాద్లో క్రైమ్ రేటు తగ్గిందని, పది నెలల్లో అన్ని జరుగుతాయనుకోవడం పొరపాటేనని ఆయన అన్నారు.
కాంగ్రెస్ కాదు... స్కాంగ్రెస్ పార్టీ: కేటీఆర్
Published Fri, Apr 3 2015 12:26 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement