ప్రతిపక్షాల కాకిగోలకు బెదరం: కేటీఆర్ | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాల కాకిగోలకు బెదరం: కేటీఆర్

Published Sun, Nov 9 2014 3:09 AM

ktr lashes out at opposition parties

 సిరిసిల్ల: ‘తెలంగాణలో కరెంటు కష్టాలు ఉన్నమాట నిజం. దీనిపై ప్రతిపక్షాలు చేస్తు న్న కాకిగోలకు మేం బెదరం. కరెంటు కష్టాలకు గతంలో పాలించిన కాంగ్రెస్, టీడీపీలే కారణం’ అని తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో శనివారం ఆసరా పథకాన్ని ఆయన ప్రారంభిం చారు. తెలంగాణలో గోదావరి, కృష్ణా నదులున్నా, అపారమైన బొగ్గున్నా... ఉత్పత్తి కేంద్రాలు లేకే కరెంటు కష్టాలు ఎదురవుతున్నాయన్నారు. 5 నెలల కొత్త రాష్ట్రంలో... కొత్త ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వకుండా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు రోడ్లెక్కి లొల్లి చేస్తున్నాయని ఆరోపించారు. చంద్రబాబు తెలంగాణకు కరెంటు రాకుండా కేంద్రానికి ఫిర్యాదులు చేస్తూ అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement