'మా పాలనపై ప్రతిపక్షాల విమర్శలు అర్ధంలేనివి' | Sakshi
Sakshi News home page

'మా పాలనపై ప్రతిపక్షాల విమర్శలు అర్ధంలేనివి'

Published Tue, Sep 9 2014 7:08 PM

ktr takes on opposition parties

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను మంత్రి కేటీఆర్ ఖండించారు. తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధంలేనివని మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తుందని స్సష్టం చేశారు. కొన్ని పార్టీలు పనిగట్టుకుని టీఆర్ఎస్ ప్రభుత్వంపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.

 

తెలంగాణలోని ప్రతీ పట్టణ, గ్రామీణ ఇంటికి మంచినీరు అందించడమే వాటర్ గ్రిడ్ లక్ష్యమని కేటీఆర్ తెలిపారు. బుధవారం గ్రామీణ నీటీ సరఫరా ఇంజనీర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Advertisement
Advertisement