ప్రొటోకాల్ వివాదమే కారణమా?
సాక్షి, కామారెడ్డి: జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయ నూతన భవన ప్రారంభంతోపాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి కామారెడ్డికి బయలుదేరిన మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు మధ్యలోంచే వెనుదిరిగారు. ప్రొటోకాల్ వివా దం కారణంగానే మంత్రి పర్యటన అర్ధంతరంగా రద్దు అయిందని భావిస్తున్నారు. కామారెడ్డి మున్సిపల్ నూతన కార్యాలయ భవనం ప్రారంభంతోపాటు మిషన్ భగీరథ పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనడానికి మంత్రి కేటీఆర్ బుధవారం కామారెడ్డికి రావాల్సి ఉంది.
ఈ మేరకు ఉదయం మంత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరారని తెలియడంతో ఆయనకు స్వాగతం పలికేందుకు నేత లంతా పట్టణ శివారు ప్రాంతానికి చేరారు. అయితే, మెదక్ జిల్లాలోని తూప్రాన్ వరకు వచ్చిన ఆయన వెనుదిరిగి వెళ్లారని తెలియడంతో నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యా రు. దీంతో మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆయా కార్యక్రమాలను నిర్వహించారు.
మున్సిపల్ కార్యా లయ ప్రారంభోత్సవం విషయంలో ప్రొటోకాల్ పాటించడం లేదని, శిలాఫలకాల్లో మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ పేరును నిబంధనలకు విరుద్ధంగా కింద రాయించారని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కలెక్టర్కు, మున్సిపల్ డైరెక్టరేట్కు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై ప్రభుత్వ పెద్దలకు, ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు వెళ్లాయని తెలుస్తోంది. అయినా వీటన్నింటినీ పక్కనపెట్టి మంత్రి కేటీఆర్ కామారెడ్డి పర్యటనకు బయలుదేరి వచ్చారు. సీఎం నుంచి ఫోన్ కాల్ రావడంతో ఆయన మధ్యలోనే వెనుదిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది. స్థానికంగా మాత్రం ప్రొటోకాల్ వివాదం తలెత్తుతుందన్న ఉద్దేశంతోనే మంత్రి వెనుదిరిగి వెళ్లారని ప్రచారం జరుగుతోంది.
మధ్య నుంచే వెనుదిరిగిన కేటీఆర్
Published Thu, Sep 21 2017 2:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
Advertisement