స్టోన్ క్రషర్స్‌లో బ్లాస్టింగ్.. కార్మికుడి మృతి | Sakshi
Sakshi News home page

స్టోన్ క్రషర్స్‌లో బ్లాస్టింగ్.. కార్మికుడి మృతి

Published Sun, Sep 20 2015 1:27 PM

labour dies in stone crusher blasting

గరిడేపల్లి: నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం అప్పన్నపేటలో ఓ స్టోన్ క్రషర్స్‌లో ఆదివారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందాడు. వివరాలు.. వెంకటసాయి స్టోన్ క్రషర్స్‌లో రాళ్ల బ్లాస్టింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగి ఆర్.నాగేశ్వరరావు అనే కార్మికుడికి రాళ్లు తగిలాయి. దీంతో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. నాగేశ్వరరావు తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతానికి చెందిన వాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement