మామ సూటిపోటి మాటలు తట్టుకోలేక.. | Sakshi
Sakshi News home page

మామ సూటిపోటి మాటలు తట్టుకోలేక..

Published Mon, Oct 17 2016 1:45 AM

మామ సూటిపోటి మాటలు తట్టుకోలేక.. - Sakshi

బిడ్డకు విషమిచ్చి తానూ తాగిన తల్లి
కోయిల్‌కొండ: భర్త మృతిచెందడంతో ఆదుకునేవారు కరువై.. మామ ఎత్తిపొడుపు మాటలతో మనస్తాపానికి గురైన ఓ తల్లి కన్నబిడ్డకు విషమిచ్చి తానూ తాగింది. ఆస్పత్రికి తరలించేలోపే ఇద్దరూ మృతిచెందారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలం చిన్నలింగల్‌చేడ్ గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన గొల్లచిన్నమల్లయ్య, శివమ్మల కూమార్తె రాములమ్మ(26)కు గండేడ్ మండలం బల్సూర్‌గొండకు చెందిన కాశీమయ్య కుమారుడు రాజమల్లయ్యతో మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. గత ఏడాది ఏప్రిల్‌లో కుటుంబ గొడవల నేపథ్యంలో తండ్రి చేతిలో రాజమల్లయ్య హత్యకు గురయ్యాడు.

గర్భవతిగా ఉన్న రాములమ్మ భర్త చనిపోవడంతో పుట్టింటికి వచ్చింది. కూలీ పని చేసుకుని జీవిస్తున్న రాములమ్మకు కొన్ని రోజుల తరువాత కూతురు శ్రీదేవి (16 నెలలు) జన్మించింది. భర్త ఆస్తిలో వాటా ఇవ్వాలని మామ కాశీమయ్యను అడిగింది. మామ ససేమిరా అనడంతో మనస్తాపానికి లోనై పురుగుల మందును బిడ్డకి తాగించి, తానూ తాగి ఆత్మహత్య చేసుకుంది. 

Advertisement
Advertisement