సాక్షి, హైదరాబాద్: తెలు గుభాష అభివృద్ధికోసం ప్రభుత్వం ఎలాంటి చర్య లనూ తీసుకోవడంలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. బాచుపల్లిలోని పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీని శనివారం ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న ప్రభు త్వానికి బాచుపల్లిలో తెలుగు విశ్వవిద్యాలయం ఉన్న విషయం కూడా తెలిసినట్టు లేదన్నారు. తెలుగు మహాసభల ద్వారా ప్రభు త్వం ఏం చెప్పదలుచుకుందని ప్రశ్నించారు. తెలుగుకు పూర్వవైభవం తీసుకువచ్చే ప్రయ త్నం ఏమైనా చేస్తున్నదా, వట్టి ప్రచార ఆర్భాట మేనా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. పరిపాలనకు సంబంధించిన జీవోలన్నీ తెలుగులోనే ఉండా లని సూచించారు. బాచుపల్లిలో వర్సిటీ భూమి 100 ఎకరాలు కబ్జాకు గురవుతున్నదని, ప్రభుత్వం దీన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.