పేద విద్యార్థులకు ఆసరా ఇస్తున్న ఉపకార వేతనాలు విద్యాసంవత్సరం ముగింపునకు చేరుకుంటున్నా అందక పోవడం విమర్శలకు గురవుతోంది. ఆఖరికి అప్పులు చేసి చెల్లించుకోవాల్సిన దుస్థితి పిల్లలకు ఏర్పడింది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాల వారికి ఇది భారంగా మారింది. సకాలంలో అధికారులు స్పందించని కారణంగా వచ్చిన నిధులు వెనక్కి మళ్లాయి.
పాలమూరు, న్యూస్లైన్ : పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూ రం కాకుండా వారికవసరమైన ఉపకారవేతనం, బోధన రుసుం అందిస్తామనే పాలకుల మాటలు ఆచరణకు నోచుకోవడంలేదు. విద్యాసంవత్సరం ముగిసినా జిల్లాలో 17,615 మంది విద్యార్థులకు అ వి అందకపోవడమే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ సంక్షేమ శాఖలకు సకాలంలో నిధులను విడుదల చేయకపోవడమే దీని కి కారణం. గత నెలాఖరులో ఎట్టకేలకు నిధులను విడుదల చేసినా ట్రెజరీలో వాటిపై ఆంక్షలు (ఫ్రీజింగ్) విధించడంతో మంజూరు ఆగిపోయింది.
ఫలితంగా రూ.16.09 కోట్లు మంజూరు కాకుండానే వెనక్కి మళ్లాయి. దీంతో విద్యార్థులు అప్పులుచేసి మరీ ఫీజులు చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంక్షేమ శాఖల్లో కలిపి మొత్తం.. మంది విద్యార్థులు 2013-14 విద్యా సంవత్సరానికి గాను ఆన్లైన్లో ఉపకార వేతనాలు, బోధన రుసుంలకు దరఖాస్తు చేసుకున్నారు. వారికి రూ.56.09 అవసరం కాగా అందులో రూ. 40కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో అధికారులు వాటిని విద్యార్థులకు అందజేశారు. మరో 17,615 మందికి రూ.16.09 కోట్లు అవసరం కాగా ప్రభుత్వం వాటిని సకాలంలో విడుదల చేయలేదు. చివరకు మార్చి నెలాఖరులో విడుదల చేసినా ట్రెజరీపై ఆంక్షల నేపథ్యంలో అవి మంజూరుకాక వెనక్కిమళ్లాయి. సాంకేతిక, ఇతర కోర్సుల్లో ఉన్నత విద్యను అభ్యసించే కొందరు విద్యార్థులు హాల్టికెట్లను పొందేందుకు అప్పుచేసి ఫీజులు కట్టాల్సిన దుస్థితి నెలకొంది.
ఇబ్బందులు అనేకం..
జిల్లాలో 17,615 మందికి ఉపకార వేతనాలు రాకపోవడానికి నిధుల విడుదల జరగకపోవడం ఓ కారణమైతే ఆధార్కార్డులు లేకపోవడం, బ్యాంక్ ఖాతాలు తప్పుగా ఇవ్వడం, ఈ ఏడాది కొత్తగా అమలుచేసిన బయోమెట్రిక్ విధానం కూడా ఇబ్బందిగా మారింది. కళాశాలల యాజమాన్యాలు బయోమెట్రిక్ పరికరాల కొనుగోలులో తీవ్ర జాప్యం చేయడం విద్యార్థులపై ప్రభావాన్ని చూపింది. విద్యార్థుల వేలిముద్రలు స్కానర్లతో సరిపోల్చాకే ప్రిన్సిపాళ్లు సంక్షేమాధికారులకు ఆన్లైన్లో నివేదిస్తారు. ఈ ప్రక్రియ ఆలస్యం కాగా హార్డ్ కాపీలను అందజేయని ఫలితంగా చాలామంది విద్యార్థుల దరఖాస్తులు ఇంకా కళాశాల స్థాయిలోనే పెండింగ్లో ఉన్నాయి. కొన్ని దరఖాస్తులు అధికారులకు చేరినా.. ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమై ఉండటం కూడా ఉపకార వేతనాల మంజూరులో ఆలస్యమైంది.
హార్డ్ కాపీలను అందిస్తే మంజూరు
నిధులపై ఫ్రీజింగ్ ఉండటం, ప్రిన్సిపాళ్లు హార్డ్ కాపీలను సకాలంలో అందించని కారణంగానే ఉపకారవేతనాల మంజూ రులో జాప్యం జరిగింది. ప్రస్తుతం ఫ్రీ జింగ్ ఎత్తివేయడంతో నిధులు సిద్ధంగా ఉన్నందున కళాశాలల యాజమాన్యాలు దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసి వాటి హార్డ్కాపీలను అందజేస్తే వాటిని తక్షణమే మంజూరుచేస్తాం. - జయప్రకాష్,
సాంఘీక సంక్షేమ శాఖ డీడీ
‘ఉపకార’మేదీ.?
Published Sun, May 11 2014 2:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
వరల్డ్కప్కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement