ఆవుల మందపై చిరుతల దాడి | Sakshi
Sakshi News home page

ఆవుల మందపై చిరుతల దాడి

Published Mon, Aug 8 2016 2:08 AM

Leopards attack cows gruop

మాచారెడ్డి: ఆవుల మందపై చిరుతలు దాడి చేయడంతో బెదిరిపోయి 15 ఆవులు పాడుబడిన బావిలో పడిపోయాయి. అందులో రెండు ఆవులు మృతి చెందాయి. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేట శివారులో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎల్లంపేటకు చెందిన ఆవుల మందను పశువుల కాపరులు ఇసాయిపేట్, అక్కాపూర్‌ల మధ్య ఉన్న సందుకట్ల గూడెం అటవీ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లారు. ఒక్కసారిగా 3 చిరుతలు పశువుల మందపై దాడి చేశాయి. దీంతో బెదిరిన ఆవులు పాడుబడిన ఓ బావిలో పడ్డాయి. అందులో రెండు ఆవులు ఊపిరాడక మృతి చెందగా.. మిగతా ఆవులకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన గ్రామస్తులు ఆవులను బయటకు తీసి వైద్య సేవలందించారు.

Advertisement
Advertisement