కొండపాక (గజ్వేల్): పెళ్లి విషయంలో పెద్దలను ఎదిరించే ధైర్యం లేక ఓ ప్రేమజంట వారు చదువుకున్న పాఠశాలలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కొండపాక మం డలంలోని లకుడారం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. లకుడారం గ్రామానికి చెందిన మంజ మల్లయ్య–నర్సవ్వల రెండో కుమారుడు కనకయ్య (21), రాచకొండ మడేలు–రేణుకల రెండో కుమార్తె తార (19)లు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. వేర్వేరు సామాజికవర్గాలకు చెందిన వీరు ప్రేమించుకుంటున్న విషయం రెండేళ్ల కిందట తెలియడంతో తార కుటుంబీకులు కనకయ్యపై దాడి చేసి పంచాయితీ పెట్టి అప్పట్లో రూ.30 వేల వరకు జరిమానా వేశారు.
ఇద్దరూ కలుసుకోరాదని, మాట్లాడుకోరాదని మందలించారు. అయినప్పటికీ వారు ప్రేమాయ ణాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఇద్దర్నీ కలవనీయరని భావించిన వారు బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయారు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో ఇరు కుటుంబాలు వెతకడం మొదలు పెట్టారు. గ్రామానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో రాజీవ్ రహదారికి సమీ పంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఓ తర గతి గదిలో వీరు ముందుగా పురుగుల మందు తాగి తర్వాత ఉరేసుకున్నారు. అటుగా వెళ్తున్న గ్రామస్తులు ఉరేసుకున్న విషయాన్ని గమనించారు. దీంతో గ్రామంలో విషయం చెప్పడంతో మృతుల కుటుంబీకులు ఘటనాస్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కుకునూరుపల్లి ఎస్సై పరమేశ్వర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ప్రేమజంట ఆత్మహత్య
Published Fri, May 17 2019 12:55 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement