మాకు పరిహారం చెల్లించాకే ఇసుక తవ్వండి.. | Sakshi
Sakshi News home page

మాకు పరిహారం చెల్లించాకే ఇసుక తవ్వండి..

Published Tue, Aug 11 2015 7:37 PM

lower maneru victims strike for exgratia

వేములవాడ(కరీంనగర్ జిల్లా): తమకు పూర్తిగా పరిహారం చెల్లించాకే ఇసుక తవ్వకాలకు అనుమతులివ్వాలని దిగువ మానేరు ముంపు ప్రాంత రైతులు ధర్నాకు దిగారు. ఈ మేరకు మంగళవారం కరీంనగర్ జిల్లా వేములవాడ మండల కేంద్రంలోని కోడుముంజా, అనుపురం గ్రామల మధ్య ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఇరు గ్రామాలకు చెందిన గ్రామస్తులు తమకు ముంపు పరిహారం పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఇసుక తవ్వకాలకు అనుమలు మంజూరు చెయ్యవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాస్తారోకోకు దిగారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement