'బంగారు తెలంగాణతో మమేకమవుతాం' | Sakshi
Sakshi News home page

'బంగారు తెలంగాణతో మమేకమవుతాం'

Published Sat, Feb 7 2015 4:12 AM

Mail to unite of bangaru telangana

హైదరాబాద్: ఉద్యోగులకు పీఆర్‌సీలో 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం నింపారని ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులంతా రాష్ట్రాభివృద్ధిలో, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములవుతారని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఫిట్‌మెంట్ పెంచడం ద్వారా, హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం సరఫరా చేయడం ద్వారా సీఎం కేసీఆర్ అందరి కడుపులు నింపారని అన్నారు.

Advertisement
Advertisement