ముఖ్యమంత్రివా? వీధిరౌడీవా?: భట్టి | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రివా? వీధిరౌడీవా?: భట్టి

Published Fri, Aug 4 2017 1:44 AM

ముఖ్యమంత్రివా? వీధిరౌడీవా?: భట్టి - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రిగా ఉన్న కె.చంద్రశేఖర్‌ రావు స్థాయిని మరచి వీధిరౌడీలా మాట్లాడుతున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లా డుతూ... సిరిసిల్ల ఘటనలో దళితుల ఆగ్రహం, కోర్టుల చివాట్లతో సీఎం కేసీఆర్‌కు మతి భ్రమించిందన్నారు.

 కేసీఆర్‌ మొదలు పెట్టిన ప్రాజెక్టులేవి, కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకున్నవేవీ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉంటూ 500 రోజులుగా సచివాలయం రావడంలే దుందుకని ప్రశ్నించారు. అభివృద్ధికి కాంగ్రెస్‌ అడ్డుపడదన్నారు. ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరిస్తే కోర్టులు ఎందుకు అడ్డుకుంటాయని ప్రశ్నించారు. సిరిసిల్లలో దళితులు, సామాన్యులపై థర్డ్‌డిగ్రీ ప్రయోగిం చడమే సరైందని సీఎం ఎలా సమర్థిస్తారని భట్టి ఈ సందర్భంగా ప్రశ్నించారు.

Advertisement
Advertisement