Sakshi News home page

‘ఆయన భాష, మాటలు తెలంగాణకు శాపం’

Published Sun, Jul 16 2017 7:21 PM

‘ఆయన భాష, మాటలు తెలంగాణకు శాపం’ - Sakshi

మధిర(ఖమ్మం జిల్లా): తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ భాష, మాటలు తెలంగాణకు పెద్ద శాపమని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ  ఉపాధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. మధిరలో విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఆపుతున్న టీఅర్ఎస్‌ను పాతాళానికి తొక్కితేనే తెలంగాణకు మోక్షం కలుగుతుందన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ బాగుపడాలంటే ఇచ్చిన కాంగ్రెస్‌ను కాపాడుకోవాలన్నారు. రాష్ట్రానికి పెద్ద శత్రువుగా తయారైన కేసీఅర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణను కాపాడుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ మీద అవాకులు, చవాకులు పేల్చుతున్న ఓ  పిల్లకాకి అని కేటీఆర్‌ను ఎద్దేవా చేశారు.

పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డుపడుతున్న కాంగ్రెస్‌ పార్టీని పాతాళంలో పాతిపెట్టాలని, అప్పుడే బంగారు తెలంగాణ సాధ్య మవుతుందని కేటీఆర్‌ శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లాలో వ్యాఖ్యానించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement