వ్యక్తి అరెస్ట్ : రూ. 45 వేలు స్వాధీనం | Sakshi
Sakshi News home page

వ్యక్తి అరెస్ట్ : రూ. 45 వేలు స్వాధీనం

Published Wed, Jan 13 2016 4:02 PM

man arrested and Rs. 45 thousand seized in gadwal

మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా గద్వాల్లో ఏటీఎంల వద్ద వృద్ధుల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ. 45 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్కి తరలించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గద్వాల్లో ఏటీఎం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని... తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో అతడు... తాను చేసిన నేరాలను ఒప్పుకున్నాడు.

Advertisement
Advertisement