కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

Published Fri, Oct 9 2015 9:40 AM

man commits suicide  in nizamabad distirict

ఎల్లారెడ్డి: నిజామాబాద్ జిల్లాలో కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన కాంతి రమేష్(26) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా కుటుంబ సభ్యులతో గొడవపడి ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement
Advertisement