ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

Published Fri, Aug 28 2015 2:49 PM

Man dies in road accident

నిజామాబాద్ (వర్ని) : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం మోస్రా గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మోస్రా గ్రామానికి చెందిన యాలాల నర్సింహయ్య(60) సైకిల్‌పై గడ్డి తీసుకొస్తుండగా బాన్సువాడ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement