మోండా మార్కెట్ వద్ద వ్యక్తి దారుణ హత్య | Sakshi
Sakshi News home page

మోండా మార్కెట్ వద్ద వ్యక్తి దారుణ హత్య

Published Tue, Feb 24 2015 10:33 AM

man murder in monda market

హైదరాబాద్ : సికింద్రాబాద్ మోండా మార్కెట్ ప్రాంతంలో ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి  జరిగింది. మార్కెట్ దగ్గరుండే సబ్‌స్టేషన్ దగ్గర వ్యక్తిని దుండగులు రాయితో కొట్టి చంపినట్టు తెలుస్తోంది.

మృతుడు బాచుపల్లికి చెందిన చందూ(30)గా గుర్తించారు. ఇతడు బాచుపల్లిలో ఓ ఫార్మా కంపెనీ ఉద్యోగి అని సమాచారం. హత్యకు గల కారణాలు తెలియరాలేదు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
(రామ్‌గోపాల్‌పేట)

Advertisement
Advertisement