ముగ్గురిని హత్య చేసిన వ్యక్తి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ముగ్గురిని హత్య చేసిన వ్యక్తి ఆత్మహత్య

Published Mon, Oct 14 2019 3:20 AM

Man Suicide At Kamareddy - Sakshi

దోమకొండ/భిక్కనూరు: సొంత బిడ్డతో సహా ముగ్గురిని కిరాతకంగా హతమార్చిన ఉన్మాది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని మల్లన్న ఆలయం సమీపంలో కుటుంబ సభ్యులు ముగ్గురిని దారుణంగా హత్య చేసిన బందెల రవి (38) ఆదివారం స్థానిక చెరువులో శవమై తేలాడు. భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన రవి తన సొంత కూతురు చందన (8), సోదరుడు బాలయ్య (45), అతని చిన్న కూతురు లత (18)లను శుక్రవారం హతమార్చిన సంగతి తెలిసిందే. ముగ్గురిని హత్య చేసిన రవి అక్కడి నుంచి గూండ్ల చెరువు వద్దకు వెళ్లి గొంతు కోసుకుని, చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement