అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Published Tue, Dec 22 2015 4:10 PM

Man suspicious death in Yalal

యాలాల (రంగారెడ్డి జిల్లా) : ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మంగళవారం యాలాల మండలంలోని కోకట్‌లో వెలుగుచూసింది. కోకట్‌కు చెందిన నర్సింహులు(34) అదే గ్రామంలోని శ్రీనివాసరెడ్డికి చెందిన పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని శరీరంపై గాయాలు ఉన్నాయి. అతన్ని ఎవరైనా హత్య చేసి అక్కడ పడివేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement