సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతుండటంతో టీఆర్ఎస్లోకి వలసలు భారీగా సాగుతున్నాయి. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఇద్దరు శనివారం అధికార పార్టీలో చేరారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శనివారం తన నివాసంలో మండవకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వద్దిరాజు రవిచంద్ర కూడా పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోనే తాము టీఆర్ఎస్లో చేరుతున్నామని ఈ ఇద్దరు నేతలు తెలిపారు. ఖమ్మం లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపునకు కృషి చేస్తానని వద్దిరాజు రవిచంద్ర ఈ సందర్భంగా తెలిపారు.
టీఆర్ఎస్లోకి పగిడిపాటి దేవయ్య...
అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గంలో మహాకూటమి తరఫున తెలంగాణ జనసమితి అభ్యర్థిగా పోటీ చేసిన పగిడిపాటి దేవయ్య శనివారం టీఆర్ఎస్ కండువా వేసుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి దేవయ్యను టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. దేవయ్య 2015 వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలలో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
సీనియర్లను గౌరవిస్తాం: కేటీఆర్
తెలుగు దేశం పార్టీనుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన సీనియర్ నేతలను సముచితంగా గౌరవిస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. టీడీపీ హైదరాబాద్ నగర విభాగ అధ్యక్షుడు ఎమ్మెన్ శ్రీనివాస్, కార్యదర్శి, వివిధ విభాగాల అధ్యక్షులు శనివారం టీఆర్ఎస్లోకి మారారు. కేటీఆర్ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరి చేరికతో తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. టీడీపీ ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందని చేరికల సందర్భంగా కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలో మిగిలిన సీనియర్ నేతలు, వివిధ విభాగాలకు చెందిన పార్టీ నాయకులు టీఆర్ఎస్లో చేరడంపై హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి పార్టీ సముచితంగా గౌరవిస్తుందని తెలిపారు. పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
‘గ్రేటర్’లో టీడీపీ ఖాళీ..!
Published Sun, Apr 7 2019 2:53 AM
Related news
-
వావ్ వాటే టెక్నాలజీ..కేసీఆర్ బస్సులో లిఫ్ట్
వావ్ వాటే టెక్నాలజీ..కేసీఆర్ బస్సులో లిఫ్ట్ -
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ‘‘రాష్ట్రం ఇప్పుడు భగ్గుమంటోంది. నా బస్సును కదలనివ్వనంత జనం.. వారి పూల స్వాగతమే చెప్తున్నాయి భవిష్యత్తు బీఆర్ఎస్దే నని.. కాంగ్రెస్ బలుపు దించాలి’’ అని వ్యాఖ్యా నించారు. కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర ఐదో రోజు శనివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. నాగర్కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఏప్రిల్ 27.. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి శంకుస్థాపన జరిగిన రోజు. 23 ఏళ్ల కింద తెలంగాణ సాధన కోసం పిడికెడు మందితో ఉక్కు సంకల్పంతో యుద్ధం ప్రారంభించిన రోజు.. బీఆర్ఎస్ పుట్టిన రోజు. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని చెప్పి ఆమరణ దీక్ష చేపట్టినప్పుడు మీరు ఇచ్చిన మద్దతు.. అప్పటి ఘటనలు యాది చేసుకుంటే.. అదో ఉప్పెన, బ్రహ్మాండమైన సన్నివేశం. నేను మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించుకున్నాం. ఈ గౌరవం చరిత్రలో ఎప్పటికీ ఉంటుంది. రైతులకు మళ్లీ కష్టాలు వచ్చాయి అడ్డగోలు హామీలిచ్చి, దు్రష్పచారం చేసి కేవలం 1.5 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో రైతులకు మళ్లీ కష్టాలు వచ్చాయి. పంటలు ఎండిపోయాయి. మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి 20 రోజులైనా కొనే దిక్కులేదు. మేం రెప్పపాటు కరెంటు పోకుండా 24 గంటల పాటు అందించాం. ఇప్పుడు కాంగెస్ పాలనలో మళ్లీ రాత్రిపూట కరెంటు కోసం తిప్పలు, బావుల వెంట పరుగులు, కరెంటు షాకులు, తేళ్లు, పాములు.. ఈ బాధలు మళ్లీ ఎందుకు వచ్చాయి? రోజు సీఎం, మంత్రులు మీటింగ్లు పెట్టి 24 గంటల కరెంటు ఇస్తున్నామని అంటున్నారు. మరి ఈ రోజు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇంట్లో నేను భోజనం చేస్తుంటే రెండు సార్లు కరెంటు పోయింది. రోజుకు పది సార్లు ఇలానే పోతోందని చెప్తున్నారు. మళ్లీ బోర్లు, నీళ్ల ట్యాంకులు, బిందెలు ఎందుకు వచ్చాయో ఆలోచించండి. ప్రభుత్వ మెడలు వంచే బలం ఇవ్వండి గ్రామాల్లో పాలోళ్ల మధ్య పంచాయతీ జరిగితే పంచులను ఎన్నుకుంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పంచాయతీలో ప్రజల తరపున యుద్ధం చేసే పంచు ఈ కేసీఆర్. ప్రాణం పోయినా తెలంగాణ తెస్తానని మాట ఇచ్చి.. తెచ్చి చూపించా. ఇప్పుడు మీ తరఫున వాదన వినిపించడానికి, ప్రభుత్వం మెడలు వంచడానికి మీరే బలం ఇవ్వాలి. కాంగ్రెస్కు ఓటేస్తే.. బీజేపీయే గెలుస్తుంది. అప్పుడేం లాభం ఉండదు. ఈ రోజు ఉదయమే రిపోర్టు వచ్చింది. మహబూబ్నగర్, నాగర్ కర్నూల్లలో బీఆర్ఎస్దే గెలుపు. రేవంత్రెడ్డివి సంస్కారం లేని మాటలు సీఎం రేవంత్రెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నరు. నా గుడ్లు పీకి గోటీలు ఆడుతడట. పేగులు తీసి మెడలో వేసుకుంటాడట. పదిహేనేళ్లు పోరాటం చేసిన తెలంగాణ సాధించిన వ్యక్తిని, తెలంగాణను పదేళ్లలో తెల్లగ చేసిన, ప్రజల కష్టాలను చూసి తండ్లాడిన వ్యక్తిని అలా అనొచ్చా. ఇది «న్యాయమా ప్రజలే చెప్పాలి. మీ ఓటు ద్వారా ధర్మాన్ని గెలిపించండి..’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, నాగం జనార్దనరెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, జైపాల్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పంటలు కావాలా.. మోదీ గత్తర కావాలా? బీజేపీ అక్కరకు రాని చుట్టం. మోదీ ఇచ్చిన వంద నినాదాల్లో ఒక్కటైనా నిజం అయిందా? మొన్న నాగర్ కర్నూల్కు గుజరాత్ సీఎం వచ్చారట. 1,500 మంది కూడా రాలే. మనకు గుజరాత్ నుంచి సీఎంలు రావాలా? మోదీ మోటార్లకు మీటర్లు పెట్టాలంటే.. నా తల తెగిపడ్డా పెట్టబోనని చెప్పిన. నేను రైతును.. నాకు వారి బాధలు తెలుసు. ఇప్పుడు మీరు బీజేపీకి ఒక్క ఓటు వేసినా.. మోదీ వచ్చి మీటర్లు పెడతా అంటడు. పచ్చని పంటలు కావాలా? మోదీ గత్తర కావాలా? ఆలోచించండి. ఆర్ఎస్పీ లాంటి వాళ్లు మళ్లీ దొరకరు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అల్లాటప్పా వ్యక్తి కాదు. మాజీ ఐపీఎస్ అధికారి. అలంపూర్ బిడ్డ. నేను సీఎం అయ్యాక గురుకుల పాఠశాలలకు ఎంత బడ్జెట్ కావాలో తీసుకోవాలని చెప్పిన. నేడు తెలంగాణ గురుకుల పాఠశాలలు ఇంటర్నేషనల్ స్కూళ్లతో సమానం. ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు, పైలట్లు, ఐఏఎస్, ఐపీఎస్లు అయ్యారు. ఎవరెస్ట్ ఎక్కిన బిడ్డలను గురుకులాల నుంచి పంపినది ప్రవీణ్కుమారే. రాష్ట్రానికి మేలు చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి. ఇలాంటి వారు మళ్లీ దొరకరు. చదువుకున్నోళ్లు వచ్చినప్పుడు గెలిపించుకోవడం మన బాధ్యత. -
ఈటల గెలుపుపై మల్లారెడ్డి వ్యాఖ్యలు.. కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ గెలవబోతున్నారని ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మల్లారెడ్డి తన రాజకీయం అనుభవంతోనే ఈటలపై ఆ కామెంట్స్ చేశారని పేర్కొన్నారు. మల్లారెడ్డి చాలా తెలివిగల వ్యక్తి అని, ఈటల రాజేందర్ను మునగ చెట్టు ఎక్కించి కింద పడేయాలనేది ఆయన వ్యూహమని తెలిపారు.బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈటలపై చేసిన వ్యాఖ్యల విషయంలో మల్లారెడ్డి తన రాజకీయ అనుభవాన్ని చాటుకున్నారని తెలిపారు. మల్లారెడ్డి మాటల అంతరార్థం తెలియక కొంతమంది ఆగమాగమవుతున్నారని, ఆయన వ్యాక్యాలు సీరియస్గా తీసుకోవద్దని తెలిపారు. మల్కాజ్గిరిలో కచ్చితంగా గెలిచేది బీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు. అది ఈటల రాజేందర్కు కూడా తెలుసన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిక స్థానాలు గెలుచుకోబోతుందని చెప్పారు కేటీఆర్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి,నేషనల్ మీడియాలో ప్రధాని మోదీకి ఓటేయ్యండి అంటూ చెబుతున్నారని విమర్శించారు. త్వరలో రేవంత్ ఖచ్చితంగా బీజేపీలోకి వెళతారని పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటికీ వరకు ప్రతి ఇంట్లో కేసీఆర్ను తలుచుకోని రోజు లేదని అన్నారు. అధికార కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత వస్తోందని దుయ్యబట్టారు. చదవండి: కోమటిరెడ్డి.. మాటలు జాగ్రత్త: కౌశిక్రెడ్డి వ్యాఖ్యలు‘రేవంత్ రెడ్డి సీక్వెన్స్ మోసాల సినిమాలు చూపిస్తున్నాడు. దేవుడి మీద ఒట్లు పెడుతూ, ఆగస్టు 15న రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేస్తున్నాడు. కొండంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం అన్నాడు కదా. ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారంటీలు అంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు.2014లో బడే బాయ్ బడా మోసం చేశారు. అనేక హామీలు ఇచ్చిన మోదీ ఏవీ చేయలేదు. తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి మోదీ. ప్రపంచ వ్యాప్తంగా క్రుడ్ ఆయిల్ ధరలు తగ్గితే కనీసం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదు. టోల్ లేని జాతీయ రహదారులు ఉన్నాయా? దేశంలో టోల్ పెట్టీ తోలు తీస్తుంది మోదీ ప్రభుత్వం. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించేందుకు బీజేపీతో జతకట్టి కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టింది . మమ్మల్ని 10 నుంచి 12 సీట్లతో గెలిపించండి. కాంగ్రెస్ మెడలు వంచుతాం.కడియం శ్రీహరి చేసిన ద్రోహం వరంగల్ లో ఏ నాయకుడు చేయలేదు. వరంగల్ ప్రజలను దారుణంగా మోసం చేశారు కడియం. ప్రపంచం వరంగల్ వైపు చూసేలా చేస్తా అంటున్న రేవంత్ రెడ్డి ముందుగా వరంగల్ కళతోరణం రాష్ట్ర అధికారిక ముద్రలో తీసినందుకు క్షమాపణ చెప్పాలి’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
సోషల్ మీడియాలోకి కేసీఆర్ ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. ఎక్స్( ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ తెరిచారు. అయితే ఇంతకాలం కేసీఆర్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలో కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు ఉద్యమ కాలం నాటి తన ఫొటోను కేసీఆర్ జత చేశారు.బస్సు యాత్రను దిగ్విజయం చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమాన ప్రజలందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఇదే ఊపుతో బస్సు యాత్రను ముందుకు కొనసాగిద్దాం, పార్లమెంటు ఎన్నికల్లో గొప్ప విజయం సాధిద్దాం అని కోరుతూ కేసీఆర్ రెండో ట్వీట్ చేశారు.కాగా ప్రస్తుతం కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టి.. ఆయా నియోజకవర్గాల్లో రోడ్షోలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్తున్న కేసీఆర్.. ఇకపై ఈ రెండు వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేయనున్నారు. ఈ యాత్ర విశేషాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన వివరాలను ఈ ఖాతాల్లో కేసీఆర్ పంచుకోనున్నారు. నేడు నాగర్కర్నూల్కుశనివారం ఉదయం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సి వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. సాయంత్రం నాగర్కర్నూల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా రోడ్షో, కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు. -
తెలంగాణను నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోను.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ హెచ్చరిక..ఇంకా ఇతర అప్డేట్స్
Related News by category
-
నాగోల్లో 2 మెట్రో స్టేషన్లు
సాక్షి, హైదరాబాద్: నాగోల్లో కొత్తగా ఎయిర్పోర్టు మెట్రో స్టేషన్ను నిర్మించనున్నారు. ఇప్పుడున్న స్టేషన్కు సమీపంలో ఎడమవైపున (ఎల్బీ నగర్ వైపు) ఉంటుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు విశాలమైన స్కైవాక్ను నిర్మిస్తారు. రాయదుర్గం, అమీర్పేట కారిడార్లో నాగోల్కు చేరుకున్న ప్రయాణికులు అక్కడి నుంచి ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు ఈ స్కైవాక్ మార్గంలో కొత్తగా నిర్మించే నాగోల్ ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట మీదుగా ఎయిర్పోర్టు వరకు కొత్త కారిడార్ నిర్మాణం జరగనుంది. ఎయిర్పోర్టు మెట్రో రెండో దశలో భాగంగా ప్రభుత్వం ప్రతిపాదించిన నాగోల్ –శంషాబాద్ ఎయిర్పోర్టు కారిడార్ మార్గంలో హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డి పర్యటించారు. నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట జంక్షన్ వరకు 14 కిలోమీటర్ల దూరం ఆయన ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ అయిన సిస్టా ఇంజనీరింగ్, సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి కాలినడకన వెళ్లి పరిశీలించారు. ఈ అలైన్మెంట్లో నిర్మించనున్న మెట్రోస్టేషన్లు, అలైన్మెంట్పై అధికారులకు, ఇంజనీరింగ్ నిపుణులకు దిశానిర్దేశం చేశారు. అలైన్మెంట్ ఇలా...♦ నాగోల్ స్టేషన్ తర్వాత మూసీ నది బ్రిడ్జిని ఆనుకొని పెద్ద మంచినీటి పైపులు, భూగర్భ హైటెన్షన్ విద్యుత్ కేబుళ్లు ఉన్నాయి. దీంతో ఈ మార్గంలో మెట్రో అలైన్మెంట్ను మరో 10 మీటర్లు ఎడమ వైపునకు జరపనున్నారు. మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు రూపొందించిన దృష్ట్యా మూసీ నదిపై మెట్రో బ్రిడ్జిని పొడవైన స్పాన్లతో నిర్మించనున్నారు. ♦ మూసీ దాటిన తరువాత కొత్తపేట వైపున్న రోడ్డుకు కనెక్టివిటీని ఇస్తూ చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులకు సదుపాయంగా ఉండేలా మరో స్టేషన్ను నిర్మించనున్నారు. నాగోల్ ఆర్టీఓ కార్యాలయం వద్ద అల్కాపురి జంక్షన్ (లక్కీ రెస్టారెంట్)కు సమీపంలో ఈ స్టేషన్ ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రయాణికులు ఔటర్రింగ్రోడ్డుకు రాకపోకలు సాగించేలా కనెక్టివిటీ ఇవ్వనున్నారు. చాంద్రాయణగుట్ట ఇంటర్చేంజ్ స్టేషన్♦ చాంద్రాయణగుట్ట వద్ద విశాలమైన ఇంటర్చేంజ్ స్టేషన్ నిర్మించనున్నారు. ఈ రూట్ లో ఫ్లైఓవర్ నిర్మాణం దృష్ట్యా చాంద్రాయణగుట్ట వరకు చేపట్టనున్న పాతబస్తీ మెట్రో విస్తరణ పనులు, కొత్త టెర్మినల్ స్టేషన్ పనులు ఇంజనీరింగ్ సవాలుగా ఉంటుందని ఎన్విఎస్ రెడ్డి చెప్పారు. రెండు కారిడార్లను అనుసంధానిస్తూ నిర్మించనున్న ఈ ఇంటర్చేంజ్ స్టేషన్లో కాంకోర్స్, ప్లాట్ఫాంల ఎత్తును సరిచేయాల్సి ఉంటుందన్నారు.ఎల్బీనగర్లో మరో స్కైవాక్.. ♦ కామినేని ఆసుపత్రి వద్ద ఒక స్టేషన్ నిర్మించనున్నారు. ఆ తర్వాత ఎల్బీనగర్ జంక్షన్లో కొత్తగా ఎల్బీనగర్ ఎయిర్పోర్టు స్టేషన్ రానుంది. ఈ మార్గంలో అండర్పాస్తోపాటు, రెండు ఫ్లైఓవర్లతో మెట్రో కారిడార్ నిర్మాణంలో ఇంజనీరింగ్ సవాళ్లు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ♦ ఎల్బీనగర్ జంక్షన్కు కుడి వైపున కొత్తగా నిర్మించనున్న మెట్రోస్టేషన్ నుంచి ఎడమవైపున ఉన్న మరో స్టేషన్ (మియాపూర్–ఎల్బీనగర్ కారిడార్)కు మరో విశాలమైన స్కైవాక్తో అనుసంధానం చేయనున్నారు. మియాపూర్, అమీర్పేట మీదుగా ఎల్బీ నగర్కు వచ్చే ప్రయాణికులు ఇక్కడి నుంచి స్కైవాక్ మార్గంలో ఎల్బీనగర్ కొత్త ఎయిర్పోర్టు మెట్రో స్టేషన్కు చేరుకుంటారు. ♦ బైరామల్గూడ, సాగర్రింగ్ రోడ్డు కూడలిలో ఇప్పటికే ఎత్తయిన ఫ్లైఓవర్లు ఉన్నందున ఈ రూట్లో ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ ఎత్తును మరింత పెంచాల్సి ఉంటుందని ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఈ జంక్షన్లో మెట్రో స్టేషన్ ఎత్తును తగ్గించడానికి, అలైన్మెంట్ను ఫ్లై ఓవర్లకు కుడి వైపునకు మార్చాల్సి ఉంటుందన్నారు. అలాగే పక్కనే ఉన్న బహిరంగ ప్రదేశంలో మెట్రో స్టేషన్ను నిర్మించనున్నారు. ♦ మైత్రీ నగర్, కర్మన్ఘాట్, చంపాపేట జంక్షన్, ఒవైసీ హాస్పిటల్, డీఆర్డీఓ, హఫీజ్ బాబానగర్ తదితర ప్రాంతాల్లో ప్రతిపాదించిన మెట్రో స్టేషన్లను చుట్టుపక్కల ఉన్న కాలనీలకు అందుబాటులో ఉండేలా కూడళ్లకు సమీపంలో నిర్మించనున్నారు. -
డబుల్ డెక్కర్ వద్దే వద్దు!
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు హైదరాబాద్ రోడ్లపై గంభీరంగా విహరించిన ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి కనిపించటం లేదు. గతంలో తీవ్ర నష్టాలు రావటంతో వాటిని క్రమంగా వదిలించుకున్న ఆర్టీసీ, ఇక డబుల్ డెక్కర్ బస్సుల ఊసును పూర్తిగా తెరమరుగు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అశోక్లేలాండ్ అనుబంధ సంస్థ స్విచ్ మొబిలిటీతో ఉన్న టెండర్ ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంటున్నట్టు తెలిసింది. అప్పట్లో.. కేటీఆర్ కోరిక మేరకు నగరంలో 2004 చివరి వరకు డబుల్ డెక్కర్ బస్సులు నడిచాయి. నిర్వహణలో నష్టాలు పెరుగుతుండటంతో వాటిని ఆర్టీసీ పక్కన పెట్టేసింది. మూడేళ్ల క్రితం నగరవాసి ఒకరు పాత డబుల్ డెక్కర్ ఫొటోను షేర్ చేస్తూ, నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు నడిపితే బాగుంటుందని సామాజిక మాధ్యమం ద్వారా కోరారు.దీనికి నాటి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి, ఆ బస్సులు నడిపే అవకాశాన్ని పరిశీలించాలని రవాణా శాఖను కోరారు. దీనికి రవాణాశాఖ సై అనటంతో ప్రయోగాత్మకంగా కొన్ని డబుల్ డెక్కర్ బస్సులు కొని నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. చాలా రోడ్లపై ఫ్లైఓవర్లు, ఫుట్ ఓవర్ వంతెనలు ఏర్పడటంతో, వాటిని నడిపేందుకు ఇబ్బంది లేని కొన్ని మార్గాలను ఎంపిక చేసింది. సుచిత్ర మీదుగా సికింద్రాబాద్–మేడ్చల్ మధ్య, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్–పటాన్చెరు, అమీర్పేట మీదుగా కోటి–పటాన్చెరు, సీబీఎస్–జీడిమెట్ల, దుర్గం చెరువు కేబుల్ వంతెన మీదుగా నడపాలని నిర్ణయించింది. ఇక దేశంలోని పలు నగరాలకు డబుల్ డెక్కర్ బస్సులను సరఫరా చేస్తున్న స్విచ్ మొబిలిటీ సంస్థ టెండర్లు దక్కించుకుంది. ధర విషయంలోనూ ఆర్టీసీతో చర్చలు జరిపి ఖరారు చేసింది. సర్కారు మార్పుతో మారిన సీన్ అంతా.. ఓకే అనుకుని బస్సులు సరఫరా చేసే వేళ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. ఫ్లైఓవర్లు, పాదచారుల వంతెనలతో డబుల్ డెక్కర్ బస్సుల నిర్వహణ ఇబ్బందే కాకుండా నష్టాలు రావటం తథ్యమన్న భావనతో ఉన్న ఆర్టీసీ నాటి మంత్రి కేటీఆర్ కోరిక మేరకు అయిష్టంగానే వాటి కొనుగోలుకు ఒప్పుకుంది. ఇప్పుడు ప్రభుత్వం మారిపోవటంతో ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించినట్టు తెలిసింది. ఓల్వో లాంటి విదేశీ బ్రాండ్ బస్సుల నిర్వహణనే భారంగా భావిస్తున్న ఆర్టీసీ.. ఏకంగా ఒక్కో బస్సు కొనుగోలుకు రూ.2 కోట్లయ్యే డబుల్ డెక్కర్ బస్సుల జోలికి పోవద్దని నిర్ణయించుకుంది. స్విచ్ మొబిలిటీ సంస్థకు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో హైదరాబాద్ కోసం డబుల్ డెక్కర్ బస్సుల తయారీ ప్రయత్నాన్ని విరమించుకుందని తెలుస్తోంది. ఆ బస్సులను ఆర్టీసీకి ఇవ్వొచ్చు కదా.. ప్రస్తుతం నగరంలో హెచ్ఎండీఏ 6 డబు ల్ డెక్కర్ బస్సులు తిప్పుతోంది. వాస్తవానికి పర్యాటకుల పేరుతో అవి రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నాయి. అంత ఖరీదైన బస్సులను ఇలా వృథాగా తిప్పే బదులు.. వాటిని సాధారణ ప్రయాణికుల సర్విసులుగా వినియోగిస్తే, ప్రయాణికులకు వెసులుబాటుగా ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ దిశగా ప్రభు త్వం ఆలోచించి ఆ బస్సులను హెచ్ఎండీఏ నుంచి ఆర్టీసీకి స్వాధీనం చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
కంటెంట్ ఉంటేనే ‘కిక్కు.. క్లిక్’
సాక్షి, హైదరాబాద్: కంటెంట్లో కిక్కు ఉండాలి...అది ఉంటేనే క్లిక్ అవుతుందనే భావనలో రాజకీయ నాయకులు ఉన్నారు. జనంలోకి దూసుకెళ్లే వీడియోలు.. వినంగానే అర్థమయ్యేలా సోది లేకుండా చెప్పే నైపుణ్యం..నిశితంగా వైరిపక్షాన్ని ఇరుకున పెట్టే వ్యూహం.. లోక్సభ ఎన్నికల వేళ నేతలు ఈ తరహా కంటెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.హైదరాబాద్కు చెందిన వికీపీడియా కంటెంట్ సొల్యూషన్స్ సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది కంటెంట్ రైటర్లు పనిచేస్తున్నారు. అసలు కంటెంట్ రైటింగ్ అంటే ఏంటో? ఎలా ఉంటుందో? ఎలా క్రియేట్ చేయాలో చెప్పేందుకు ప్రత్యేక శిక్షణ సంస్థలూ ఉన్నాయి. ఢిల్లీకి దగ్గర్లోని గుర్గావ్లో ఇలాంటి పేరెన్నికగల సంస్థల్లో చాలామంది శిక్షణ పొందుతున్నట్టు వీక్పీడియా సంస్థ అధిపతి కుమార్జైన్ తెలిపారు. ఇలా శిక్షణ తీసుకున్నవారు కొన్నేళ్లుగా ఎన్నికలు, ఇతర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరి ఆధ్వర్యంలో పనిచేసిన మరో 80 వేల మంది వరకూ కంటెంట్ రైటర్లుగా మారిపోయారు. ‘క్లిక్’మనిపించడమే సవాల్ రాజకీయపార్టీ ఏదైనా సరే ఎన్నికల్లో గెలవాలనే అనుకుంటుంది. ఈ దిశగానే వారి ఆశయాలు, ఆచరణ విధానాలను ప్రజల్లోకి తీసుకెళుతుంది. వాట్సాప్, యూట్యూ బ్, ఇన్స్టా, ఫేస్బుక్ ఇలా అన్ని సోషల్ మీడియాల్లోనూ తమ వాదన ‘క్లిక్’కావాలనే కోరుకుంటాయి. ఇక్కడే కంటెంట్ రైటర్ ప్రావీణ్యత ముడిపడి ఉంది. నేతను జనంలో నిలబెట్టే మెళకువలు అందిపుచ్చుకోవడంలో దేశవ్యాప్తంగా 60 శాతం కంటెంట్ రైటర్లు విజయం సాధిస్తున్నారని ఢిల్లీకి చెందిన ఇండియా కంటెంట్స్ మేనేజర్ విజయ్కుమార్ మల్హోత్రా తెలిపారు. పోస్టు పెట్టాక రివ్యూ చేస్తారు. ఎంతమందికి అది రీచ్ అయింది తెలుసుకుని.. సరైన స్పందన లేకపోతే కంటెంట్ మార్చడానికి ప్రయత్నిస్తుంటారు. నాయకుడికి సంబంధింన కంటెంట్ రైటర్ తను పెట్టే వీడియోలు, ఫొటోలు ఓటర్లకు రీచ్ కాకపోతే కంటెంట్ రైటర్ చిక్కుల్లో పడ్డట్టే. దీనికోసం కంటెంట్ రైటర్లు కూడా సొంత ఫాలోవర్స్ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. మంచి గిరాకీనే..కంటెంట్ రైటర్లకు ఎన్నికల సీజన్లో మంచి గిరాకీ ఉంటుంది. ఒక్కో సంస్థ పరిధిలో కనీసం 50 మంది పనిచేస్తుంటారు. నాయకుడి అందించే కాన్సెప్ట్ అర్థం చేసుకొని, అందుకు అనుగుణంగా అవసరమైన డైలాగ్స్, సెటైర్లతో కంటెంట్ ఇవ్వడం వీరి బాధ్యత. దీనిని వీడియో ఎడిటర్ చిత్రీకరణలోకి తీసుకెళతాడు. చిత్రం చాలా తేలికగా ఉండాలంటే, ఈజీగా ఉండే పదాలు, వాడుక భాషను కంటెంట్ రైటర్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కంటెంట్ అందిచడం అనేక విధాలుగా ఉంటుందని ది రైటర్స్ అనే సంస్థకు చెందిన విఠల్ తెలిపాడు. అధికార పార్టీ నేత పోటీ చేస్తున్నప్పుడు ప్రభుత్వ పథకాలు, జరిగిన లబ్దిపై ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో విపక్షాలు లేవనెత్తే ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కూడా కంటెంట్ ఇవ్వాలి. దీనిని వీలైనంత తక్కువ నిడివి గల వీడియో చిత్రీకరణకు అనువుగా ఉండాలని నేతలు కోరుతున్నట్టు కంటెంట్ రైటర్లు చెబుతున్నారు. విపక్షమైతే ఎదురుదాడి ప్రధానాస్త్రంగా కిక్ ఎక్కించే కంటెంట్ కోరుకుంటోంది. కంటెంట్ క్లిక్ అయ్యే దాన్ని బట్టి రెమ్యూనరేషన్ డిమాండ్ ఉంటోంది. కొంతమంది ఎన్నికల సమయం వరకూ ప్యాకేజీగా రూ.25 నుంచి రూ.40 లక్షల వరకూ తీసుకుంటున్నారు. మరికొంతమంది నేతలు వారి స్థాయిని బట్టి రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. ఇది కూడా రూ.10 లక్షలకు తక్కువ ఉండదు. -
అధిక ఉష్ణోగ్రత... ఆపై ఉక్కపోత!
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు మాడుపగిలే ఎండ, వడగాడ్పులు... మరోవైపు చెమటలు కారేలా ఉక్కపోత. ఇదీ శనివారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన వాతావరణ పరిస్థితి. రాష్ట్రంలో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ సీజన్లో ప్రస్తుతం నమోదు కావాల్సిన సాధారణ సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయి. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. ♦ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటింది. రానున్న మూడు రోజులు ఇదే తరహాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగుడెం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్నగర్ జిల్లాలకు ఈ నెల 28 నుంచి 30 వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. ప్రచండ భానుడు.. రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాల ప్రకారం చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగానే నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.4, నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో 45.3, ములుగు జిల్లా మల్లురులో 45.2 డిగ్రీల సెల్సీయస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే మహబూబ్నగర్లో 43.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు మించి నమోదయ్యాయి.మహబూబ్నగర్లో సాధారణం కంటే 3.3 డిగ్రీల సెల్సియస్, ఖమ్మంలో 3.2 డిగ్రీల సెల్సియస్ అధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదవగా మిగతా ప్రాంతాల్లో ఒక డిగ్రీ సెల్సియస్ నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పెద్దలు, పిల్లలు, దీర్ఘకాలిక సమస్యలున్న వారు బయటకు రాకపోవడమే మంచిదని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది.ఆకు రాల్చిన అభయారణ్యం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పాకాల అభయారణ్యం వేలాది ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. అన్ని రకాల జంతువులు, పక్షులకు నిలయమిది. సరస్సు చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం పచ్చదనంతో అన్ని రకాల పక్షుల అలజడితో చూడముచ్చటగా ఉండేది. వేసవిలో మండుతున్న ఎండలతో చెట్లన్నీ ఆకురాలడంతో అటవీ ప్రాంతమంతా బోసిపోయి ఇలా కనిపిస్తోంది. – నర్సంపేట -
సోషల్ మీడియాలోకి కేసీఆర్ ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. ఎక్స్( ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ తెరిచారు. అయితే ఇంతకాలం కేసీఆర్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలో కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు ఉద్యమ కాలం నాటి తన ఫొటోను కేసీఆర్ జత చేశారు.బస్సు యాత్రను దిగ్విజయం చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమాన ప్రజలందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఇదే ఊపుతో బస్సు యాత్రను ముందుకు కొనసాగిద్దాం, పార్లమెంటు ఎన్నికల్లో గొప్ప విజయం సాధిద్దాం అని కోరుతూ కేసీఆర్ రెండో ట్వీట్ చేశారు.కాగా ప్రస్తుతం కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టి.. ఆయా నియోజకవర్గాల్లో రోడ్షోలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్తున్న కేసీఆర్.. ఇకపై ఈ రెండు వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేయనున్నారు. ఈ యాత్ర విశేషాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన వివరాలను ఈ ఖాతాల్లో కేసీఆర్ పంచుకోనున్నారు. నేడు నాగర్కర్నూల్కుశనివారం ఉదయం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సి వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. సాయంత్రం నాగర్కర్నూల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా రోడ్షో, కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement