మావోయిస్టు పార్టీపై నిషేధం పొడిగింపు | Sakshi
Sakshi News home page

మావోయిస్టు పార్టీపై నిషేధం పొడిగింపు

Published Tue, Aug 26 2014 1:51 AM

Maoist party is the extension of the ban

హైదరాబాద్: రాష్ట్రంలో సీపీఐ(మావోయి స్టు) పార్టీతో పాటు దాని అనుబంధ సంఘాలపై మరో ఏడాది  నిషేధం విధిస్తూ  తెలంగాణ ప్ర భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మావోయిస్టు పార్టీతో పాటు దాని  అనుబంధ సంఘాలైన ఆర్‌ఎస్‌యు, రైతు కూలీ సంఘం, జననాట్యమండ లి తదితర సంఘాలకూ ఇది వర్తిస్తుందని తెలి పింది. 

రెండు రోజుల క్రితమే ఉత్తర్వులను జారీ చేసినప్పటికీ  ప్రభుత్వం గోప్యంగా ఉంచింది.  1992లో తొలిసారిగా పీపుల్స్‌వార్ పార్టీని  ప్రభుత్వం నిషేధించగా, ప్రతి ఏడాది పొడిగిస్తూ  ఉత్తర్వులను  జారీ చేస్తోంది. 2004లో మావోయిస్టు పార్టీగా  పీపుల్స్‌వార్ రూపాంతరం చెందాక  కూడా ఈ నిషేధాన్ని అమలు చేస్త్తున్నారు.
 

Advertisement
Advertisement