మానవాళికి మరో పుడమి కాగలదని భావిస్తున్న అరుణగ్రహాన్ని చేరాలంటే ఇప్పుడు కనీసం 9 నెలలు పడుతోంది. అందుకే మానవ సహిత అంగారక యాత్ర ఇంకా సాధ్యం కావడం లేదు. అయితే, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయత్నం ఫలిస్తే గనక.. మార్స్ యాత్ర ఇక 39 రోజులే! విదేశాలకు వెళ్లినట్లు ఇలా వెళ్లి.. అలా వచ్చేయొచ్చు! ఇదెలా సాధ్యం అంటే.. అంగార కుడి చెంతకు మనల్ని కొన్ని రోజుల్లోనే చేర్చే అసలుసిసలు ప్లాస్మా రాకెట్ ఇంజన్ ‘వసీమర్’ రూపు దిద్దుకుంటోంది మరి!
ఏమిటీ ప్లాస్మా ఇంజన్..?
మామూలు రాకెట్ ఇంజన్ల మాదిరిగా రసాయన ఇంధనాలతో కాకుండా ప్లాస్మాను వేడిచేయడం ద్వారా ఇది పనిచేస్తుంది. ‘వేరియేబుల్ స్పెసిఫిక్ ఇంపల్స్ మ్యాగ్నెటోప్లాస్మా రాకెట్(వసీమర్)’ అనే ఈ ఇంజన్ను అమెరికాలోని టెక్సాస్కు చెందిన ‘యాడ్ ఆస్ట్రా రాకెట్’ కంపెనీ తయారు చేస్తోంది. ఈ ఇంజన్ను మూడు సంవత్సరాల్లోగా సిద్ధం చేసేందుకు నాసా ఈ కంపెనీకి రూ. 62 కోట్ల నిధులు ప్రకటించింది. అయితే, భూమిపై నుంచి రాకెట్లను ప్రయోగించే ఇంజన్ కాదిది. అంతరిక్షంలోకి చేరిన వ్యోమనౌకలను మాత్రమే ఇది అత్యధిక వేగంతో ముందుకు తీసుకుపోతుంది.
ఎలా పనిచేస్తుంది..?
విద్యుదావేశ వాయువు(ప్లాస్మా)ను రేడియో తరంగాల ద్వారా అత్యధిక ఉష్ణోగ్రతలకు వేడిచేస్తుంది. దీనివల్ల బలమైన అయస్కాంత క్షేత్రాలు ఏర్పడి ప్లాస్మాను ఇంజన్ వెనకవైపు గుండా అత్యధిక బలంగా తోస్తాయి. ప్లాస్మా వేగంగా వెనక్కి వెళ్లడం వల్ల ఇంజన్ అనూహ్య వేగంతో ముందుకు దూసుకెళుతుంది.
ప్రయోజనాలేంటి..?
అంగారకుడు భూమికి అతిదగ్గరగా వచ్చినప్పుడు సుమారుగా 5.46 కోట్ల కి.మీ., అతిదూరంగా ఉన్నప్పుడు 40 కోట్ల కి.మీ. ప్రయాణించాల్సి ఉంటుంది. మార్స్ స్థానాన్ని బట్టి ప్రయోగం చేపట్టాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుత టెక్నాలజీతో అంగారకుడి దగ్గరికి వెళ్లేందుకు 9 నెలలు పడుతుంది. కానీ అక్కడి నుంచి తిరిగి బయలుదేరాలంటే ఏడాదిపాటు ఆగాల్సిందే. ఆ తర్వాత మళ్లీ 9 నెలలు ప్రయాణి ంచి భూమికి తిరిగిరావాల్సి ఉంటుంది. అంటే.. ఒక మార్స్ యాత్రకు మూడేళ్లు పడుతుందన్నమాట! అదే వసీమర్ ఇంజన్ అందుబాటులోకి వస్తే మానవసహిత మార్స్ యాత్రలు ఎంతో సులభం. గ్రహశకలాలను భూమికి దగ్గరగా తీసుకొచ్చి వాటి నుంచి ఖనిజాలను తవ్వుకునే వ్యోమనౌకలకూ ఈ ఇంజన్ ఉపయోగపడుతుంది.
అంగారక యాత్ర.. 39 రోజులే!
Published Mon, Apr 13 2015 2:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement