హన్మకొండ అర్బన్ : తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. హన్మకొండ నక్కల గుట్టలోని హరిత కాకతీయ హోటల్లో జరగుతున్న ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) జాతీయ కార్యవర్గ సమావేశా ల ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా స్పీకర్ మాట్లాడుతూ వ్యక్తిగతంగా, కుటుంబపరంగా జర్నలిస్టులు ఎన్ని సమస్యల్లో ఉన్న సమాజహితం కోసం నిస్వార్థంగా పనిచేస్తారని కొ నియాడారు. తెలంగాణ ఉద్యమ కాలంలో అనేక ఇబ్బం దులకు ఎదురునిలిచి ఉద్యమాన్ని ముందుకు నడిపించేలా ప్రజలను ైచె తన్యపరిచిన ఘనత జర్నలిస్టులకు దక్కుతుందని అన్నారు. ఉద్యమంలో వారి సేవలు గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం పలు కార్యక్రమా లు చేపడుతున్నారని తెలిపారు.
డబుల్ బెడ్రూం ఇం డ్లు, హెల్త్ కార్డులు అందులో భాగమే అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు మాట్లాడుతూ ప్రస్తుతం జర్నలిజంలో విలువలు తగ్గుతున్నాయని, దీనికి కారణం మాత్రం జర్నలిస్టులు కాదన్నారు. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు ఈ రంగంలోకి రావడంతో వారి స్వలాభం కోసం పనులు చేసుకుంటున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాలు ప్రజలకు చేరవేయడం జర్నలిస్టులకు కత్తిమీద సాములా మారిందని తెలిపారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక ర్యాక్రమాలు చేపడుతోందని అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు వివరించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో సుమారు 26రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఐజే యూ జాతీయ అధ్యక్షుడు ఎస్ఎన్.సిన్హా, జాతీయ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్, నాయకులు కె.శ్రీనివాస్రెడ్డి, దాసరి కృష్ణారెడ్డి, దొంతు రమేష్, నాయకులు పాల్గొన్నారు.
ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది
Published Mon, Feb 29 2016 1:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
Advertisement