చలించిపోయిన మాసాయిపేట గ్రామస్తులు
వెల్దుర్తి: మాసాయిపేట రైల్వే క్రాసింగ్ వద్ద గురువారం ఉదయం జరిగిన దుర్ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన తూప్రాన్ కాకతీయ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. మరో పది నిముషాల్లో రైల్వ్ గేట్ అవతల ఉన్న మాసాయిపేట గ్రామంలో విద్యార్థులు బ్యాగులు, టిఫిన్ బాక్స్లు పట్టుకోని తల్లిదండ్రుల సహాయంతో 15మంది విద్యార్థులు బస్సు ఎక్కడానికి సిద్ధమయ్యారు. ఒక్కసారిగా రైలు బస్సును ఢీకొట్టడంతో పెద్ద శబ్ధం వచ్చింది. దీంతో ఉలిక్కిపడిన గ్రామస్తులు ప్రమాద స్థలానికి పరుగులు తీశారు. అంతలోనే విద్యార్థులు ఉన్న బస్సు బోల్తా కొట్టడం, బస్సులో నుంచి విద్యార్థుల మృతదేహాలు చూసిన గ్రామస్తులు భయందోళన గురయ్యారు.
కొంతమంది విద్యార్థులు బస్సులో ఇరుక్కుపోయి ఉండడం చూసి చలించి పోయారు. కాగా, గత ఏడాది తూప్రాన్లోని సిద్ధార్థ స్కూల్కు చెందిన బస్సు మాసాయిపేట గ్రామంలో విద్యార్థులను ఎక్కించుకొని రైల్వే ట్రాక్పై నిలిచిపోయింది. అప్పటికే కూత వేటు దూరంలో ఉన్న శ్రీనివాస్నగర్ స్టేషన్ నుంచి రైలు వస్తుండడంతో ఒక్కసారిగా విద్యార్థులు బస్సులో నుంచి కేకలు వేస్తూ దిగుతుండడాన్ని గమనించిన రైలు డ్రైవర్ బ్రేక్ వేయడంతో బస్సుకు 10మీటర్లు దూరం వచ్చి ఆగిపోయింది. దీంతో విద్యార్థుల ప్రాణాలు దక్కాయి. అప్పట్లో గ్రామానికి చెందిన పలువురు సికింద్రాబాద్లోని రైల్వే జీఎంను కలిసి పరిస్థితి వివరించారు. అసంపూర్తి ఉన్న రేల్వే గేటును నిర్మించి ప్రజల ప్రాణాలను రక్షించాలని విన్నవించినా ఫలితం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ దుర్ఘటనకు ప్రధాన కారణం రైల్వే అధికారులేనని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
పది నిమిషాలైతే.. మరో 15మంది బలయ్యేవారే..
Published Fri, Jul 25 2014 2:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement