'కొత్త భాష్యం చెబుతున్న టీఆర్ఎస్ సర్కారు' | Sakshi
Sakshi News home page

'కొత్త భాష్యం చెబుతున్న టీఆర్ఎస్ సర్కారు'

Published Fri, Sep 19 2014 6:19 PM

masani babu rao slams trs government

హైదరాబాద్: గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాన్నే టిఆర్ఎస్ సర్కార్‌ అనుసరించడం దౌర్భాగ్యమని ఎబీవీపీ తెలంగాణ అధ్యక్షుడు మాసాని బాబురావు అన్నారు. నిజాం పరిపాలనలో ఉన్న కొన్ని జిల్లాలు కర్ణాటక, మహారాష్ట్రలో కలిశాయని.. ఇప్పుడు అక్కడి ప్రభుత్వాలు విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతున్నాయని అన్నారు.

కానీ తెలంగాణాలో ఏర్పడిన ప్రస్తుత ప్రభుత్వం మాత్రం కొత్త భాష్యం చెబుతుందని అన్నారు. విమోచనం కాదు విలీనం అని కోట్లాది మంది తెలంగాణవాదుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు.

Advertisement
Advertisement