అల్లాదుర్గం రూరల్ : కట్టెలు లేక, గ్యాస్ అయిపోవడంతో మూడు గంటల వరకు భోజనం లేకపోవడంతో విద్యార్థుల కడుపులు కాలి కన్నీరు పెట్టిన ఘటన మండల కేద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో సోమవారం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని స్థానిక విలేకరులతో తమ గోడును వెల్లబోసుకున్నారు. 15 రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని సరిగా భోజనం చేయడం లేదన్నారు. రోజూ నీళ్ల చారు చేస్తున్నారని, తాగునీరు కూడా కలుషితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ రోజు (సోమవారం) హాస్టల్లో గ్యాస్ అయిపోయిందని, ఇదే సమయంలో కట్టెలు కూడా లేకపోవడంతో ఉదయం టిఫెన్ కూడా లేదన్నారు. కనీసం మధ్యాహ్నం ఒంటి గంటకైనా అన్నం పెడతారనుకుంటే మూడు గంటలకు పెట్టారని తెలిపారు. దీంతో చాలా మంది విద్యార్థినులు ఆకలికి తట్టుకోలేక ఏడ్చార న్నారు. గతంలో ఒక సారి గ్యాస్ అయిపోవడంతో వంట మనిషి మా వద్ద డ బ్బులు వసూలు చేసింది. ఇంత వరకు తిరిగి ఇవ్వలేదని తెలిపారు. ఇదిలా ఉండగా.. విషయం తెలుసుకున్న అల్లాదుర్గం ఎంపీపీ ఇందిర, టీఆర్ఎస్ నాయకులు సుభాష్రావ్, బసవరాజ్, ప్రేమ్ కుమార్, కిషోర్, వెంకట్రెడ్డిలు కస్తూర్బా విద్యాలయానికి చేరుకుని బిస్కెట్ అందజేశారు.
ఈ విషయాన్ని నాయకులు ఎమ్మెల్యే బాబూమోహన్కు ఫోన్లో తెలిపారు. సమాచారం అందుకున్న ఆర్వీఎం సీఎంఓ వెంకటేశం, డిప్యూటీ తహశీల్దార్ తులసీరాంలు అల్లాదుర్గం కేజీవీబీలో విచారణ జరిపారు. ఇదిలా ఉండగా విద్యాలయ ప్రిన్సిపాల్ జ్యోతి మెటర్నటీ లీవ్లో ఉండగా ఇన్చార్జ్గా ప్రతిభ బాధ్యలు చేపట్టారు. అయితే ఆమె తనకు మెయిటెనెన్స్ బాధ్యతలు అప్పగించలేదని తెలిపారు. దీంతో తానేమీ చేయలేకపోయానని చెప్పారు.
గ్యాస్ లేదని పస్తులు పెట్టారు
Published Mon, Sep 8 2014 11:45 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement