పంచాయతీ కార్యదర్శుల నియామకాల్లో జాప్యం
నెలలు గడుస్తున్నా పోస్టింగ్ ఆర్డర్లులివ్వని వైనం
{పజావాణిలో డీఆర్వోకు విన్నవించిన అభ్యర్థులు
పంచాయతీరాజ్ శాఖ మంత్రి స్పందించాలని వినతి
ఉద్యోగం కోసం వారెంతో శ్రమించారు. ప్రభుత్వం పెట్టిన అన్ని పరీక్షల్లో నెగ్గి పంచాయతీ కార్యదర్శి కొలువు కొట్టారు. కానీ వారికి ఆ ఆనందమే మిగలకుండాపోయింది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకుండా అధికారులు నెలల తరబడి తాత్సారం చేస్తున్నారు. కొందరి విద్యార్హతలపై అనుమానం ఉంద ని, విచారణ తర్వాతే అందరికీ పోస్టింగ్ అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికే నల్లగొండ, నిజామాబాద్, మెదక్, వరంగల్ జిల్లాల్లో అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సొంత జిల్లాలో మాత్రం పోస్టింగుల్లో జాప్యం కావడం గమనార్హం.
జిల్లాలో ఖాళీగా ఉన్న 88 పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేసేందుకు గతేడాది చివరలో అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 23న రాత పరీక్ష నిర్వహించింది. మార్చిలో ఫలితాలు వెలువడ్డారుు. రెండువారాల లోపు ఎంపికైన అభ్యర్థుల విద్యార్హత ధ్రువీకరణపత్రాలు పరిశీలించి వారికి పోస్టింగ్లు ఇవ్వాలి. జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా ఉపాధికల్పనాధికారులతో కూడిన ఎంపిక కమిటీ జూన్, జూలైలో మూడుసార్లు అభ్యర్థుల విద్యార్హత సర్టిఫికెట్లను పరిశీలించింది. ఈ నెల 3న తుది పరిశీలన జరిగింది. ఇందులో 14 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లపై అనుమానం వ్యక్తం చేసిన అధికారులు ప్రక్రియను అక్కడే నిలిపేశారు. అనుమానిత అభ్యర్థుల సర్టిఫికెట్లు తీసుకుని.. వారు ఏ సమయంలో ఎక్కడ చదివారని విచారణ చేయాలని నిర్ణయించారు. కానీ.. ఇంతవరకు విచారణ మొదలే కాలేదు. దీంతో సర్టిఫికెట్లు సరిగా ఉన్న 74 మంది అభ్యర్థులు తమకు పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలంటూ జిల్లా పంచాయతీ అధికారులపై ఒత్తిడి తెచ్చారు.
14 మంది అనుమానిత అభ్యర్థుల సర్టిఫికెట్లు సరిగా ఉన్నాయని తేలిన తర్వాతే అందరికీ ఒకేసారి ఉత్తర్వులు ఇస్తామని, అప్పటివరకు వేచి ఉండాలని అధికారులు లింకుపెట్టారు. ఆ తర్వాత కూడా నియామక ప్రక్రియ నిలిచిపోవడంతో అభ్యర్థులు పలుమార్లు డీపీవోను కలిసి పోస్టింగ్ ఆర్డర్ల కోసం మొరపెట్టుకున్నారు. అయినా స్పందన లేకపోవడంతో సోమవారం ప్రజావాణిలో డీఆర్వో వీరబ్రహ్మయ్యకు విన్నవించారు. ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారి కుమారస్వామి వివరణ ఇస్తూ.. 14మంది అభ్యర్థుల విద్యార్హతలపై అనుమానం ఉందని, క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన తర్వాత అందరికీ ఒకేసారి పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తామని చెప్పారు. అభ్యర్థులు చింతించాల్సిన అవసరం లేదన్నారు.
మంత్రిగారు.. చూశారా తీరు!
Published Tue, Jul 15 2014 2:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement