పట్టాలు పంపిణీ చేసిన మంత్రి మహేందర్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

పట్టాలు పంపిణీ చేసిన మంత్రి మహేందర్‌రెడ్డి

Published Fri, Jun 5 2015 3:56 PM

పట్టాలు పంపిణీ చేసిన మంత్రి మహేందర్‌రెడ్డి - Sakshi

సరూర్‌నగర్ (రంగారెడ్డి) : అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అందించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా శుక్రవారం నగరంలోని సరూర్‌ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు పేదలకు ఇండ్ల స్థలాలకు సంబంధించిన పట్టాల పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటూ టీడీపీ మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి, టీడీపీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యలు పాల్గొన్నారు. వీరితోపాటు పలువురు టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement