Sakshi News home page

లోకేష్‌ను బట్టలిప్పి కొడతారు: మహేందర్‌రెడ్డి

Published Sat, Oct 11 2014 1:10 AM

minister mahindhar reddy fire on nara lokesh

హైదరాబాద్: తెలంగాణలో ఆంధ్రపార్టీలకు స్థానం లేదని, ఆ పార్టీల నాయకులను ప్రజలు ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో  మాట్లాడుతూ, ఆంధ్రవ్యక్తులు తెలంగాణలో నాయకత్వం వహిస్తామంటే ఎవరూ ఊర్కోరని, తెలంగాణలో చంద్రబాబు కొడుకు లోకేష్‌కు ఏంపనని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజలు లోకేశ్‌ను బట్టలిప్పి మరీ కొడతారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి, దయాకర్‌రావు వంటి వ్యక్తులు ఏ ముఖం పెట్టుకొని లోకేష్ గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.  
 
 

Advertisement

What’s your opinion

Advertisement