హైదరాబాద్: తెలంగాణలో ఆంధ్రపార్టీలకు స్థానం లేదని, ఆ పార్టీల నాయకులను ప్రజలు ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రవ్యక్తులు తెలంగాణలో నాయకత్వం వహిస్తామంటే ఎవరూ ఊర్కోరని, తెలంగాణలో చంద్రబాబు కొడుకు లోకేష్కు ఏంపనని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలు లోకేశ్ను బట్టలిప్పి మరీ కొడతారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్రెడ్డి, దయాకర్రావు వంటి వ్యక్తులు ఏ ముఖం పెట్టుకొని లోకేష్ గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
లోకేష్ను బట్టలిప్పి కొడతారు: మహేందర్రెడ్డి
Published Sat, Oct 11 2014 1:10 AM
Related news
-
సోషల్ మీడియాలోకి కేసీఆర్ ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. ఎక్స్( ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ తెరిచారు. అయితే ఇంతకాలం కేసీఆర్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలో కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు ఉద్యమ కాలం నాటి తన ఫొటోను కేసీఆర్ జత చేశారు.బస్సు యాత్రను దిగ్విజయం చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమాన ప్రజలందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఇదే ఊపుతో బస్సు యాత్రను ముందుకు కొనసాగిద్దాం, పార్లమెంటు ఎన్నికల్లో గొప్ప విజయం సాధిద్దాం అని కోరుతూ కేసీఆర్ రెండో ట్వీట్ చేశారు.కాగా ప్రస్తుతం కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టి.. ఆయా నియోజకవర్గాల్లో రోడ్షోలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్తున్న కేసీఆర్.. ఇకపై ఈ రెండు వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేయనున్నారు. ఈ యాత్ర విశేషాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన వివరాలను ఈ ఖాతాల్లో కేసీఆర్ పంచుకోనున్నారు. నేడు నాగర్కర్నూల్కుశనివారం ఉదయం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సి వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. సాయంత్రం నాగర్కర్నూల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా రోడ్షో, కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు. -
సూపర్-6.. సూపర్-10 పేరుతో ‘కూటమి’ మరో మోసం: పేర్ని నాని
సాక్షి, గుంటూరు: మరోసారి కూటమి మోసం చేసే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సూపర్-6, సూపర్-10 పేరుతో మరోసారి మోసానికి తెరలేపారన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, 2014లో చంద్రబాబు మాయమాటలు చెప్పారు.. ప్రజల్ని నమ్మించి టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేశారు. మరోసారి ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తామన్నారు.2019లో ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశాం: మంత్రి ధర్మానశ్రీకాకుళం: మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ మేనిఫెస్టో ను భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావిస్తామన్నారు. 2019లో ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశాం. మేనిఫెస్టోను చంద్రబాబు హేళనగా తీసుకుంటారు. 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి 20 వేలు కూడా ఇవ్వలేదు. 2014లో చంద్రబాబు మహిళల రుణాలు రద్దు చేస్తామన్నారు. నమ్మి ఓటేసిన మహిళలను చంద్రబాబు మోసం చేశారు’’ అని మంత్రి ధర్మాన మండిపడ్డారు.మోసం చేయకుండా చేసేవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టాం: మంత్రి బొత్సవిశాఖపట్నం: అన్ని వర్గాలకు మంచి జరిగేలా వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ‘‘మోసం చేయకుండా చేసేవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టాం. గత మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చారు. విద్యా, వైద్యం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. పేద ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా పథకాలు ఉన్నాయి. లంచాలు, వివక్ష లేకుండా డీబీటీ ద్వారా నగదు జమ చేశాం. గతంలో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారు. చంద్రబాబు మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.. ఇచ్చిన ప్రతి మాటలను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. సీఎం జగన్ మేనిఫెస్టోలో పెట్టని అంశాలు కూడా అమలు చేశారు’’ అని మంత్రి బొత్స అన్నారు. ప్రజలను కష్టాల నుంచి బయట పడేసే మేనిఫెస్టో ఇది: తమ్మినేని సీతారాం సంస్కరణల దిశగా వైసీపీ విధానాలు వెళ్తున్నాయి. మేనిఫెస్టోలో విశాఖను క్యాపిటల్ టౌన్గా ప్రకటించడం సంతోషం. ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు అంతా విశాఖ రాజధాని కావాలని కోరుకుంటున్నారు. చంద్రబాబుది కాపీ మేనిఫెస్టో. టీడీపీలాగా సాధ్యం కానీ హామీలు ఇవ్వలేదు. -
మహిళలకు శుభవార్త
మహిళలకు శుభవార్త -
సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఎలా మోసం చేస్తున్నాడో వివరించిన జగన్
సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఎలా మోసం చేస్తున్నాడో వివరించిన జగన్ -
2014లో చంద్రబాబు ఇచ్చిన ముఖ్యమైన హామీలు.
2014లో చంద్రబాబు ఇచ్చిన ముఖ్యమైన హామీలు.
Related News by category
-
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: 2014 ఎన్నికల్లో జనసేన, బీజేపీతో జట్టు కట్టి దొంగ హామీలిచ్చి ప్రజలను వంచించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అదే కూటమి కట్టి సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్.. సూపర్ టెన్ అంటూ నమ్మబలుకుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ‘‘చంద్రబాబు చెప్పే ఈ సూపర్ సిక్స్.. సూపర్ టెన్లకు ఎంత ఖర్చవుతుంది..? ఏటా రూ.1.50 లక్షల కోట్లు ఇవ్వాలి. అసలు ఇది సాధ్యమేనా?’ అని నిలదీశారు. ‘‘మళ్లీ అదే కూటమి.. మళ్లీ అదే సంతకం.. మళ్లీ అవే మోసాలు.. హిస్టరీ రిపీట్’’ అంటూ మండిపడ్డారు. శనివారం వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టో–2024ను విడుదల చేస్తూ సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే..హామీలు అమలు చేయకుంటే పేదల బతుకులు ఛిన్నాభిన్నం..అధికారంలోకి వచ్చిన పార్టీ తాను ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే పేదల బతుకులు ఛిన్నాభిన్నం అవుతాయి. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే.. మనకన్నా ముందు పరిపాలించిన ప్రభుత్వమే దీనికి ఉదాహరణ. అప్పట్లో చంద్రబాబు, ఆయన కూటమి, ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? అవి ఏ ఒక్కటీ అమలు చేయకపోవడంతో ప్రజల బతుకులు ఏ విధంగా ఛిన్నాభిన్నమయ్యాయో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. 2014లో ఇదే మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ముగ్గురి ఫోటోలు, చంద్రబాబు సంతకంతో ముఖ్యమైన అంశాలు అంటూ ప్రతి ఇంటికి ఒక పాంప్లెట్ పంపించారు. ఎల్లో మీడియాలోనూ ఊదరగొట్టారు. ఒక తల్లి మెడలో మంగళసూత్రం లాగేస్తూ ఉంటే ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. బాబు వస్తున్నాడు.. బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి వస్తుంది... అనేది ఆ అడ్వర్డైజ్మెంట్. వాళ్లు చెప్పిన మాటలు, హామీలను నమ్మి ఓటు వేసినందుకు నాడు తమ బతుకులు ఎలా అతలాకుతలం అయ్యాయో నాగరిక ప్రపంచంలో ప్రజలు గుర్తించాలి. ఒక రాజకీయ నాయకుడిని, ఒక పార్టీని, మేనిఫెస్టోను నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారు. ఆ తర్వాత అవి అమలు చేయకుంటే ప్రజలు బతుకులు ఏమవుతాయోనని కనీసం ఆలోచన కూడా లేకుండా రాజకీయాలు చేయడం మొదలుపెడితే పరిస్థితులు ఎలా ఉంటాయి?మాట మీద నిలబడే వాడే నాయకుడు..రాజకీయ నాయకుడుంటే ఎలా ఉండాలి? ఒక మాట చెబితే ఆ మాట మీద తాను నిలబడతాడనే నమ్మకం ఉండాలి. అదిగో ఫలానా వ్యక్తి మా నాయకుడు, మా లీడర్ అని ఏ కార్యకర్త అయినా కాలర్ ఎగరేసుకుని చెప్పుకునేలా ఉండాలి. చంద్రబాబులా చేస్తే కాలర్ ఎగరేసుకుని చెప్పడం మాట దేవుడెరుగు.. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలు కనిపిస్తే దొడ్డిదారిన పారిపోవాల్సి వస్తుంది. గ్రామాల్లో సమూల మార్పులుఇవాళ గ్రామాల్లోకి అడుగుపెట్టి నాలుగు అడుగులు ముందుకు వేస్తే సచివాలయం కనిపిస్తోంది. 600 రకాల సేవలు, 60 – 70 ఇళ్లకు ఒక వలంటీర్, వివక్ష, అవినీతి లేకుండా ఇంటికే డోర్ డెలివరీ చేస్తున్న సేవలు అందుతున్నాయి. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తోపాటు ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష తెచ్చాం. విస్తరించిన ఆరోగ్యశ్రీ సేవలతోపాటు ఆరోగ్య ఆసరా అందిస్తున్నాం. గ్రామాల్లో రైతన్నను చేయిపట్టుకుని నడిపించే రైతుభరోసా కేంద్రాలు, నాడు నేడుతో సమూలంగా మారిపోయిన ఇంగ్లీషు మీడియం బడులు కనిపిస్తున్నాయి. ఇవన్నీ మరో 10–15 సంవత్సరాలు కొనసాగితే ఎంత గొప్ప మార్పు వస్తుందో ఆలోచన చేయండి. 99 శాతం హామీలు అమలు చేశాం► 2014 నుంచి 2019 వరకు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 32,000 కాగా మనం ఈ 58 నెలల కాలంలో ఏకంగా 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ప్రతి సచివాలయంలో ఆ పిల్లలు కనిపిస్తారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు, స్టాప్లు, పారామెడికల్ స్టాఫ్ కనిపిస్తారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం హామీలను అమలు చేశాం. ► వలంటీర్లు, గ్రామ సచివాలయాల వ్యవస్థలు గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్ధం చెబుతున్నాయి. ఈ 58 నెలల పాలనకు ముందు ప్రభుత్వ పథకాలు లంచాలు, వివక్ష లేకుండా అందుతాయంటే ఎవరైనా నమ్మేవారా? ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మీ ఇంటికే వస్తాయంటే నమ్మేవాళ్లా? మొట్టమొదటసారిగా మార్పు చేసి చూపించాం.► ఇవాళ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే 68 శాతం మంత్రి పదవుల్లో ఉన్నారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు ఆ వర్గాల వారే ఉన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లను ఏకంగా చట్టం చేసి మరీ అమలు చేశాం. 175 అసెంబ్లీ, 25 ఎంపీలు కలిపి మొత్తం 200 స్ధానాలకు గానూ ఏకంగా 50శాతం అంటే 100 స్ధానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇవ్వడం రాష్ట్ర చరిత్రలోఎప్పుడైనా జరిగిందా? పోనీ దేశంలో ఎప్పుడైనా జరిగిందా? ఎవరైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఇచ్చిందా?. సామాజిక న్యాయానికి అర్ధం చెబుతూ మాటల్లో కాకుండా చేతల్లో చూపించాం. ► మన పల్లెటూరి పిల్లలు, పేద పిల్లలు ఐక్యరాజ్యసమితికి వెళ్లి రెట్టించిన ఆత్మ విశ్వాసంతో ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడటం ఇవాళ మనమంతా చూశాం. గవర్నమెంటు బడుల్లో నాడు నేడుతో రూపురేఖలు మారాయి. ఇంగ్లీషు మీడియం గవర్నమెంటు బడుల్లో ఒక హక్కుగా అందుబాటులోకి వచ్చింది. మరో పదేళ్లు ఇదే పాలన కొనసాగితే ఎలాంటి పెను మార్పులు వస్తాయో ఒక్కసారి ఊహించండి. ఇప్పుడు ఒకటో తరగతి చదువుతున్న పిల్లవాడు 2035లో టెన్త్ క్లాస్లో ఐబీ ఎగ్జామ్ రాస్తాడు. మొట్టమొదటిసారిగా ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ లాంటి వర్సిటీల కోర్సులు మన డిగ్రీలతో అనుసంధానం చేసి ఆన్లైన్ ద్వారా సర్టిఫికెట్లు అందించేలా చర్యలు తీసుకున్నాం.2035 నాటికి ఐబీలో మన పిల్లలు పదోతరగతి సర్టిఫికెట్ తీసుకుంటారు. ఆ తర్వాత నాలుగైదేళ్లకు డిగ్రీ పాసవుతారు. ఆ డిగ్రీ కోర్సుల్లో దాదాపు 30 శాతం కోర్సులకు హార్వర్డ్, స్టాన్ఫర్డ్ నుంచి సర్టిఫికెట్లు వస్తాయి. మరో 10–15 ఏళ్లలో క్వాలిటీ చదువులతో పిల్లలు అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడుతూ ఉద్యోగాలు సాధిస్తారు. పేదరికం మటుమాయం అవుతుంది. విద్యారంగంలో మొదలుపెడితే వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, అవ్వాతాతల సంక్షేమం, సామాజిక న్యాయంలో ఇవాళ విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. సాధ్యం కాదని తెలిసీ దొంగ హామీలు► 2019లో మనం ప్రకటించి అమలు చేసిన స్కీమ్లు, సంస్కరణలు, డీబీటీ, నాన్ డీబీటీ ( ఇళ్ల స్ధలాలు, పిల్లలకిచ్చే ట్యాబ్లు, విద్యాకానుక, గోరుముద్ద లాంటివన్నీ) కలిపితే సంవత్సరానికి దాదాపు రూ.70 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా, ఎప్పుడూ చూడని మార్పులతో అడుగులు ముందుకు వేస్తే అంత డబ్బు ప్రజలకు మనం నేరుగా ఇవ్వగలిగాం.► ఈ రోజు చంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్, సూపర్ టెన్లు గమనిస్తే వాటికి ఏడాదికి రూ.1,21,619 కోట్లు అవుతుంది. వీటికి తోడు జగన్ అమలు చేస్తున్న కొన్ని పథకాలను ఆపడం ఎవరి వల్లా కాదు. అటువంటివి కొన్ని పథకాలున్నాయి. వసతి దీవెన, విద్యాదీవెన ఆపడం ఎవరి వల్లా కాదు. ఆరోగ్యశ్రీ, సంపూర్ణ పోషణ ఆపడం ఎవరి వల్లా కాదు. ఉచిత బియ్యం ఇస్తున్నాం. 18.50 లక్షల మంది రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. జగన్ చిన్నపిల్లలకు గోరుముద్ద ఇస్తున్నాడు. ఎవరున్నా ఇది అమలు చేయక తప్పదు. ఇటువంటి పథకాలకు మరో రూ.29,100 కోట్లు ఏ ప్రభుత్వమైనా ఖర్చు చేయక తప్పదు. ఇవన్నీ కలిపితే రూ.1,50,718 కోట్లు కావాలి. జగన్ ఎంతో కష్టపడితే, ఎప్పుడూ జరగని విధంగా పరిపాలన అందిస్తే రూ.70 వేల కోట్లు చాలా కష్టపడి ఇవ్వగలుగుతున్నాం.నమ్మి ఓటేస్తే ఒక్క హామీనైనా నెరవేర్చావా బాబూ?► టీడీపీ 2014 మేనిఫెస్టో ముఖ్యమైన హామీల్లో రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానని చంద్రబాబు అన్నారు. రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయా?► పొదుపు సంఘాల రుణాలు రూ.14,205 కోట్లు పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. ఒక్క రూపాయి అయినా మాఫీ చేశారా? ► ఆడబిడ్డ పుట్టిన వెంటనే రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తాం అన్నారు. ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశారా? ► ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకి రూ.2,000 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లు అంటే 60 నెలలు. నెలకు రూ.2,000 చొప్పున రూ.1.20 లక్షలు ఏం ఇంటికైనా ఇచ్చారా? పిల్లల జీవితాలతో ఆడుకున్నారు.► అర్హులందరికీ మూడు సెంట్లు స్ధలం, పక్కా ఇల్లు అన్నారు. కనీసం ఒక్క సెంటు స్థలం ఎవరికైనా ఇచ్చారా? ► రూ.పదివేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్ రుణాల మాఫీ అన్నారు. అయ్యాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశారా? సింగపూర్కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తా అన్నారు.తాడేపల్లి సంగతి దేవుడెరుగు.. విజయవాడలో కూడా కనిపించడం లేదు. ► నాడు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేస్తే ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చారా చంద్రబాబూ? ప్రత్యేక హోదా అయినా తెచ్చారా? దాన్నీ అమ్మేశారు! ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా? అంటూ వెటకారం చేశారు. ► అంతవరకు అందుతున్న సున్నావడ్డీ రుణాలను కూడా రైతులకు ఎగ్గొట్టారు.► పొదుపు సంఘాలకు రుణమాఫీ దేవుడెరుగు 2016 అక్టోబరు వరకు అందుతున్న సున్నావడ్డీని సైతం రద్దు చేశారు. దీంతో పొదుపు సంఘాలు ఓవర్ డ్యూస్, ఎన్పీఏలు 18 శాతానికి వెళ్లిపోయాయి. ఏ గ్రేడ్, బి గ్రేడ్ సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్గా మారిపోయాయి. పొదుపు సంఘాలన్నీ రోడ్డున పడ్డాయి.రిపీటెడ్గా.. హేబిట్యువల్ అఫెండర్లాచంద్రబాబు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చయ్యే సూపర్ సిక్స్, సూపర్ టెన్ పేరుతో ప్రజలను అడ్డగోలుగా మోసం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాడు. మనం చెబుతున్న రూ.70 వేల కోట్లకు అదనంగా మరో రూ.80 వేల కోట్లు ఇస్తామంటున్నాడు. సాధ్యం కాదని తెలిసినా నమ్మబలుకుతున్నాడు. సాధ్యం కాదని తెలిసీ ఒక రాజకీయ నాయకుడు రిపీటెడ్గా.. హేబిట్యువల్ అఫెండర్లా.. 2014లో మాదిరిగా సాధ్యం కాని హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతున్నారు. సాధ్యం కాని హామీలతో ఇలా మోసం చేసేందుకు అడుగులు వేయడం దొంగతనం కన్నా దారుణం కాదా? 420 కాదా? చీటింగ్ కాదా? ఆలోచన చేయండి. మీ మనసులకే విడిచిపెడుతున్నా. -
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
సాక్షి, అమరావతి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ మలివిడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. రాష్ట్రంలో 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వైఎస్సార్ సర్కిల్లో ఆదివారం ఉ.10 గంటలకు నిర్వహించే బహిరంగసభతో ఈ ప్రచార భేరి మోగించనున్నారు. అనంతరం.. మ.12.30కు తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని వెంకటగిరిలోని త్రిభువని సర్కిల్లో నిర్వహించే బహిరంగసభలోనూ.. అలాగే, మ.3 గంటలకు నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని కందుకూరు కేఎంసీ సర్కిల్లో జరిగే సభలోనూ సీఎం జగన్ పాల్గొంటారు. సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు (ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (దక్షిణ కోస్తా)లలో ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్వహించిన సిద్ధం సభలకు జనం సునామీలా పోటెత్తారు. రాప్తాడు, మేదరమెట్ల సభలు ఉమ్మడి, తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతిపెద్ద ప్రజాసభలుగా నిలిచాయి. రేపటి ప్రచారం ఇలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 29న (సోమవారం) అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన షెడ్యూల్ విడుదల చేశారు. 29 ఉ.10 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలో.. అదేరోజు మ.12.30కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో.. సా.3.00 గంటలకు గుంటూరు జిల్లా పొన్నూరు సభల్లో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారన్నారు. కూటమి కకావికలు...మరోవైపు.. టీడీపీ–జనసేన–బీజేపీ మూడు పార్టీలు కూటమిగా జట్టుకట్టాక తాడేపల్లిగూడెం, చిలకలూరిపేటలో నిర్వహించిన సభలతోపాటు చంద్రబాబు, పవన్ ఎన్నికల ప్రచారానికి జనస్పందన కన్పించకపోవడంతో కూటమి శ్రేణులు డీలాపడ్డాయి. 2014 ఇదే కూటమి ఎడాపెడా హామీలిచ్చేసి, అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేసిన మోసంపై ఇప్పటికీ ప్రజలు రగిలిపోతున్నారు. 2019 ఎన్నికల్లో విడిపోయి మళ్లీ ఇప్పుడు మరోసారి జనసేన, బీజేపీతో టీడీపీ జట్టుకట్టడాన్ని పచ్చి అవకాశవాదంగా ప్రజలు పరిగణిస్తున్నారని.. అందుకే కూటమి సభలకు జనం మొహం చాటేస్తున్నారని రాజకీయ పరిశీలకులు స్పష్టంచేస్తున్నారు. ఇది కూటమి శ్రేణులను కకావికలం చేస్తోంది. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నయాజోష్.. ఇక సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ కావడం.. బస్సుయాత్ర చరిత్ర సృష్టించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు, సానుభూతిపరులు రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీఎం జగన్ ఎన్నికల మలివిడత ప్రచారానికి శ్రీకారం చుడుతుండటంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నయాజోష్ నెలకొంది. ఉప్పొంగుతున్న అభిమాన సంద్రం.. ఎన్నికల తొలివిడత ప్రచారంలో భాగంగా గతనెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నుంచి సీఎం జగన్ ప్రారంభించిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర 23 జిల్లాల్లో 86 నియోజకవర్గాల్లో 2,188 కిలోమీటర్ల దూరం సాగి, ఈనెల 24న శ్రీకాకుళం జిల్లా అక్కవరం వద్ద ముగిసింది. ఈ యాత్రకు జనం తండోపతండాలుగా పోటెత్తడంతో నైతిక స్థైర్యం దెబ్బతిన్న కూటమి శ్రేణులు కుదేలయ్యాయి. బస్సుయాత్రలో మండుటెండైనా.. అర్థరాత్రయినా అభిమాన సంద్రం ఉప్పొంగింది. ఇక ఇచ్చిన హామీలన్నీ అమలుచేయడం.. సుపరిపాలన అందించడం ద్వారా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపిన సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో బలమైన నమ్మకాన్ని బస్సుయాత్ర ప్రతిబింబించిదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో పాదయాత్ర తరహాలో ఇప్పుడు బస్సుయాత్ర ద్వారా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా సీఎం జగన్ మార్చేశారని తేల్చిచెబుతున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించడం తథ్యమని జాతీయ, ప్రతిష్టాత్మక పొలిటికల్ కన్సల్టెన్సీలు నిర్వహించిన 20కి పైగా సర్వేలు తేల్చిచెప్పడమే అందుకు తార్కాణం. -
ఈటల గెలుపుపై మల్లారెడ్డి వ్యాఖ్యలు.. కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ గెలవబోతున్నారని ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మల్లారెడ్డి తన రాజకీయం అనుభవంతోనే ఈటలపై ఆ కామెంట్స్ చేశారని పేర్కొన్నారు. మల్లారెడ్డి చాలా తెలివిగల వ్యక్తి అని, ఈటల రాజేందర్ను మునగ చెట్టు ఎక్కించి కింద పడేయాలనేది ఆయన వ్యూహమని తెలిపారు.బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈటలపై చేసిన వ్యాఖ్యల విషయంలో మల్లారెడ్డి తన రాజకీయ అనుభవాన్ని చాటుకున్నారని తెలిపారు. మల్లారెడ్డి మాటల అంతరార్థం తెలియక కొంతమంది ఆగమాగమవుతున్నారని, ఆయన వ్యాక్యాలు సీరియస్గా తీసుకోవద్దని తెలిపారు. మల్కాజ్గిరిలో కచ్చితంగా గెలిచేది బీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు. అది ఈటల రాజేందర్కు కూడా తెలుసన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిక స్థానాలు గెలుచుకోబోతుందని చెప్పారు కేటీఆర్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి,నేషనల్ మీడియాలో ప్రధాని మోదీకి ఓటేయ్యండి అంటూ చెబుతున్నారని విమర్శించారు. త్వరలో రేవంత్ ఖచ్చితంగా బీజేపీలోకి వెళతారని పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటికీ వరకు ప్రతి ఇంట్లో కేసీఆర్ను తలుచుకోని రోజు లేదని అన్నారు. అధికార కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత వస్తోందని దుయ్యబట్టారు. చదవండి: కోమటిరెడ్డి.. మాటలు జాగ్రత్త: కౌశిక్రెడ్డి వ్యాఖ్యలు‘రేవంత్ రెడ్డి సీక్వెన్స్ మోసాల సినిమాలు చూపిస్తున్నాడు. దేవుడి మీద ఒట్లు పెడుతూ, ఆగస్టు 15న రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేస్తున్నాడు. కొండంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం అన్నాడు కదా. ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారంటీలు అంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు.2014లో బడే బాయ్ బడా మోసం చేశారు. అనేక హామీలు ఇచ్చిన మోదీ ఏవీ చేయలేదు. తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి మోదీ. ప్రపంచ వ్యాప్తంగా క్రుడ్ ఆయిల్ ధరలు తగ్గితే కనీసం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదు. టోల్ లేని జాతీయ రహదారులు ఉన్నాయా? దేశంలో టోల్ పెట్టీ తోలు తీస్తుంది మోదీ ప్రభుత్వం. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించేందుకు బీజేపీతో జతకట్టి కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టింది . మమ్మల్ని 10 నుంచి 12 సీట్లతో గెలిపించండి. కాంగ్రెస్ మెడలు వంచుతాం.కడియం శ్రీహరి చేసిన ద్రోహం వరంగల్ లో ఏ నాయకుడు చేయలేదు. వరంగల్ ప్రజలను దారుణంగా మోసం చేశారు కడియం. ప్రపంచం వరంగల్ వైపు చూసేలా చేస్తా అంటున్న రేవంత్ రెడ్డి ముందుగా వరంగల్ కళతోరణం రాష్ట్ర అధికారిక ముద్రలో తీసినందుకు క్షమాపణ చెప్పాలి’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
బోండా ఉమా అఫిడవిట్ తప్పుల తడక: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: బోండా ఉమా అఫిడవిట్ తప్పుల తడక అని.. ఆయన మోసాలకు పాల్పడ్డారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. 2014లో బోండా ఉమా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అధికారులను తప్పుదారి పట్టించారని దుయ్యబట్టారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బోండాపై మేం మూడు ఫిర్యాదులు చేశాం. సింగ్ నగర్ పార్టీ ఆఫీస్లో ఓట్లు నమోదయ్యాయి. ఎన్నికల నియమావళి ప్రకారం రెసిడెన్షియల్లోనే ఓట్లు ఉండాలి. మా ఫిర్యాదుపై సరైన చర్యలు తీసుకోలేదు. 2014లో అఫిడవిట్లో తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్ పెట్టారు. 2019 అఫిడవిట్లోనూ తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్నే పెట్టారు. 2024 అఫిడవిట్లో సింగ్నగర్ పార్టీ ఆఫీస్ను ఇల్లుగా చూపించాడు. ఆ భవనం ప్లాన్ అప్లై చేసినప్పుడే టీడీపీ పార్టీ ఆఫీస్ పేరుతో అనుమతులు తీసుకున్నారు. పార్టీ ఆఫీస్లో ఆయన ఎలా నివాసముంటున్నారు?. పార్టీ ఆఫీస్లో ఓట్లు ఎలా నమోదు చేస్తారు?’’ అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు.‘‘గతంలో వైఎస్సార్సీపీ నేతల ఓట్లను బోండా బలవంతంగా రద్దు చేయించాడు. అదే రూల్ ఇప్పుడు బోండాకు ఎందుకు వర్తించదు. టీడీపీ పార్టీ ఆఫీస్లోనే బోండా కుటుంబానికి చెందిన ఐదు ఓట్లు ఉన్నాయి. బోండా ఉమా అభ్యర్ధిగా పోటీ చేసేందుకు అనర్హుడు. మా దగ్గర అన్ని ఆధారాలున్నాయి. నేను ఇక్కడితో ఆగను. బోండాపై చర్యలు తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తా. బోండా తన కుమారుడితో సంబంధం లేదని చెప్పి ఓటు ఇక్కడే చూపించారు. ఒక కుమారుడు ఇతర దేశంలో ఉంటారని చెప్పి.. ఓటు ఇక్కడే చూపించాడు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా బోండా తప్పుడు సమాచారం ఇచ్చాడు. తప్పుడు డాక్యుమెంట్తో ఓటు చూపించాడు. బోండా ఉమా ఓటు రద్దుచేయించే వరకూ పోరాడతా’’ అని వెల్లంపల్లి తేల్చి చెప్పారు.‘‘నేను పక్క నియోజకవర్గం నుంచి వచ్చానంటున్నాడు. బోండా పక్క నియోజకవర్గం నుంచి రాలేదా?. ఎమ్మెల్యేగా గెలిచాక.. నేను సెంట్రల్ నియోజకవర్గంలోనే నివాసముంటా.. బోండా ఉమా... అతని సతీమణి.. ఇద్దరు కుమారులు.. కోడలు ఓట్లు చెల్లవు. పార్టీ కార్యాలయాన్ని ఇల్లుగా చూపించారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎవరైనా కాపురాలు చేస్తారా?. బోండా ఉమా చెల్లదు.. కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. బోండాను అనర్హుడిగా ప్రకటించే వరకూ పోరాడతా. బోండా ఉమా అధికారులను బెదిరిస్తున్నాడు. బీజేపీతో పొత్తులో ఉన్నామని బెదిరిస్తున్నాడు.2 కోట్ల 54 లక్షల 97వేల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాడు. బోండా ఉమా ఆర్థిక నేరస్తుడు. బోండా ఉమా వంటి ఆర్ధిక నేరస్తుడికి ఓటేయొద్దు. 2019లో పెండింగ్లో ఉన్నవి.. 2014లో ఉన్న కేసులు 2024 అఫిడవిట్లో పొందుపరచలేదు. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. బోండా ఉమాపై ఉన్న కేసులపై తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. వేరే పార్టీలను ప్రచారం చేయనీయకుండా చేస్తున్నారు. వేరే పార్టీలకు అవకాశం లేకుండా పర్మిషన్లు తీసుకుని తిరగకుండా చేస్తున్నారు. మా ప్రచారాన్ని అడ్డుకోవడానికి దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నాడు’’ అంటూ వెల్లంపల్లి ధ్వజమెత్తారు.‘‘మా హక్కులకు బోండా ఉమా భంగం కలిగిస్తున్నాడు. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశాం. బోండా ఉమా దిక్కుమాలిన రాజకీయం మానుకోవాలి. ఓటు అడగనోడివి నీరెందుకు బోండా ఉమా అనుమతులు. ఓటమి భయంతోనే బోండా నీచ రాజకీయాలు చేస్తున్నాడు. బోండాను కచ్చితంగా ఓడించి తీరుతాం.. బుద్ధిచెబుతా’’ అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. -
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి యనమల కృష్ణుడు
సాక్షి, తాడేపల్లి: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు వైఎస్సార్సీపీలోకి చేరారు. యనమల కృష్ణుడితో పాటు టీడీపీ నేతలు పి.శేషగిరిరావు, పి.హరిక్రిష్ణ, ఎల్.భాస్కర్ వైఎస్సార్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో తుని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దాడిశెట్టి రాజా, కాకినాడ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్ పాల్గొన్నారు.ఐదేళ్ల సీఎం జగన్ పాలన చూసి వైఎస్సార్సీపీలో చేరా..సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ, టీడీపీలో డబ్బున్న వాళ్లకి, ఎన్నారైలకే టిక్కెట్లిచ్చారని.. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారిని మోసం చేశారని మండిపడ్డారు. టీడీపీలో 42 సంవత్సరాలుగా ఉన్నా. చంద్రబాబు, యనమల మోసం వల్లే నాకు అన్యాయం జరిగింది. చంద్రబాబు బీసీలను మోసం చేశారనడానికి నేనే ఉదాహరణ. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లో ఉన్నా. నాకు తుని టిక్కెట్ ఇవ్వకపోగా.. నన్ను ఘోరంగా అవమానించారు. తునిలో ఏరోజూ యనమల రామకృష్ణుడు లేరు’’ అంటూ కృష్ణుడు ధ్వజమెత్తారు.‘‘42 సంవత్సరాలగా ప్రజల మధ్య ఉన్నది నేనే.. ఐదేళ్ల సీఎం జగన్ పాలన చూసి వైఎస్సార్సీపీలో చేరా. సీఎం వైఎస్ జగన్ని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి కృషి చేస్తా. కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్, తుని ఎమ్మెల్యేగా దాడిశెట్టి రాజా గెలుపునకు కృషి చేస్తా’’ అని కృష్ణుడు తెలిపారు.
Advertisement
Photos
View allVideo
View allTuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement