మెనూ పాటించడం లేదని మండిపాటు
ఎస్సీ బాలుర హాస్టల్ ఆకస్మిక తనిఖీ
ఎమ్మెల్యేకు సమస్యలు విన్నవించిన విద్యార్థులు
మణుగూరు : ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం విద్యార్థులకు పెట్టాలని మెనూ సక్రమంగా పాటించని వార్డెన్నుపై పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆగ్రహించారు. ఈ మేరకు గురువారం ఉదయం మణుగూరు ప్రభుత్వ ఎస్సీ బాలుర హాస్టళ్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే వచ్చే సమయానికి హాస్టల్లో వార్డెన్ లేకపోవడంతో మీరు లేకుండా విద్యార్థులు ఎలా ఉంటారని వార్డెన్ను ప్రశ్నించారు. విద్యార్థులకు వండిన వంటను పరిశీలించారు. చారు నీళ్లలా ఉందని, మెనూ ప్రకారం తమకు భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే హాస్టల్ రికార్డులను పరిశీలించారు. స్టోర్ రూమ్లో ఉన్న సామాన్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తమకు స్కాలర్షిప్లు ఇవ్వకపోవడంతో భోజనాలు పెట్టడం లేదని ఎస్ఎంహెచ్ హాస్టల్ విద్యార్థులు ఎమ్మెల్యేకు పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. హాస్టల్లో తాగునీటి సమస్య, మరుగుదొడ్ల సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవని విద్యార్థులు ఆయనకు తెలిపారు. సమస్యలను తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తనన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు హాస్టల్ వార్డెన్ కృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి వట్టం రాంబాబు, మండల గౌరవ అధ్యక్షుడు పల్లపు తిరుమలేశ్, కార్యదర్శి గాండ్ల సురేష్, జిల్లా నాయకులు పెద్ది నాగకృష్ణ, మండల యూత్ నాయకుడు రంజిత్, నాయకులు మేడ నాగేశ్వరరావు, జె సురేష్ వార్డు సభ్యులు మిట్టపల్లి కిరణ్కుమార్ పాల్గొన్నారు.
హాస్టల్ వార్డెన్పై ఎమ్మెల్యే ‘పాయం’ ఆగ్రహం
Published Fri, Jul 31 2015 3:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement