మహబూబాబాద్ : సర్దార్ వల్లబాయ్ పటేల్ విగ్రహానికి, ఇతరత్ర నిర్మాణాలకు రూ.200కోట్లు కేటాయించిన ప్రధాని నరేంద్రమోడీ మహిళల భద్రత కోసం కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారు.. మహిళలపై ఆయనకున్న అభిమానం ఏపాటిదో బడ్జెట్తోనే బయటపడిందని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు వి.సంధ్య విమర్శించారు.
498ఎ చట్టం అమలుపై సోమవారం పీఓడబ్ల్యూ మానుకో ట శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో చర్చాగోష్టి నిర్వహించారు. జిల్లా కార్యదర్శి బొమ్మెరబోయిన అనసూయ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమం లో సంధ్య మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా మహిళల సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయకపోవడం వల్లే లైంగిక దాడులు జరుగుతున్నాయని, దాడులను అన్యాయాలను ఎదుర్కోవడానికి సామూహికం గా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పురుషులతో సమానంగా మహిళలకు హక్కు కల్పించాలన్నదే హిందు కోడ్ ఉద్దేశమని చెప్పారు.
ఇందిరాగాంధీ సమయంలోనూ ఏనాడూ మహిళా చట్టాలపై, వారి సమస్యలపై స్పందిం చి న దాఖలాలు లేవన్నారు. వరకట్న నిషేధ చట్టం, ఇతరత్రా వాటిని పోరాటాల ద్వారానే సాధించుకోగలిగామని పేర్కొన్నారు. పాలకులు 498ఎ చట్టానికి తూట్లు పొడుతున్నారని, కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ చట్టం వచ్చిందని చెప్పారు. ఆ చట్టం పటిష్టంగా అమలు కావడానికి మహిళలు ఉద్యమించాలని కోరారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు నర్సక్క, రాష్ట్ర నాయకురాలు నిర్మల, నాయకులు మండల వెంకన్న, బోగ రవిచంద్ర, సామ పాపన్న, తాజ్పాషా, పాఠశాల హెచ్ఎం మరియమ్మ, తదితరులు పాల్గొన్నారు.
మహిళలపై మోడీ వివక్ష
Published Tue, Sep 2 2014 2:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement