రిజర్వాయర్‌లో తల్లీకొడుకుల గల్లంతు | Sakshi
Sakshi News home page

రిజర్వాయర్‌లో తల్లీకొడుకుల గల్లంతు

Published Mon, Aug 31 2015 2:06 PM

mother and son commits suicide

చేర్యాల: వరంగల్ జిల్లా చేర్యాల మండలం ఐనాపూర్‌లోని తపాస్‌పల్లి రిజర్వాయర్‌లో ఓ తల్లి, కుమారుడు గల్లంతయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఏఎన్‌ఎంగా పనిచేసే పాక లత(35) తన ఇద్దరు కుమారులతో కలసి సోమవారం ఉదయం రిజర్వాయర్ వద్దకు వెళ్లినట్టు తెలుస్తోంది. తన తల్లి లత, అన్నయ్య విశ్వనాథం (10) రిజర్వాయర్‌లో పడి చనిపోయారంటూ ఓ బాలుడు అక్కడ ఏడుస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు అక్కడకు చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. లత భర్త చంద్రమౌళి టీచర్‌గా పనిచేస్తున్నారు. రిజర్వాయర్ చూసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ పడిపోయారా? లేక ఆత్మహత్యాయత్నం చేశారా అన్నది తెలియాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement