తనయుడికి బ్రెయిన్‌ స్ట్రోక్, తల్లికి గుండెపోటు! | Sakshi
Sakshi News home page

తనయుడికి బ్రెయిన్‌ స్ట్రోక్, తల్లికి గుండెపోటు!

Published Fri, Sep 22 2017 12:45 AM

తనయుడికి బ్రెయిన్‌ స్ట్రోక్, తల్లికి గుండెపోటు!

ఒకేరోజు తల్లీకొడుకుల మరణం

బోధన్‌ రూరల్‌ (బోధన్‌):  కుమారుడు బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మర ణించడంతో తల్లడిల్లిన ఆ తల్లి గుండె ఆగి పోయింది. నిజామా బాద్‌ జిల్లా బోధన్‌ మండలం జాడీ జమాల్‌పూర్‌కు చెందిన గాలి అన్స య్య, శౌరమ్మ (73) దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. కుమారులు ముగ్గురూ ఆర్మీలో చేరారు. 12 ఏళ్ల క్రితం భర్త మృతి చెందడంతో శౌరమ్మ ఏపీలోని గుంటూరు జిల్లా నర్సరావుపేటలో చిన్నకొడుకు ఇన్నయ్య వద్ద ఉంటోంది.

ఈమె పెద్ద కొడుకు విజయ్‌కుమార్‌ (53)  ఆర్మీ ఉద్యోగ విరమణ అనంతరం హైదరాబాద్‌ లోని ఇండియన్‌ ఇమ్మునోలాజికల్‌లో సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తు న్నారు. బుధవారం విధినిర్వహణలో ఉండగా బ్రెయిన్‌స్ట్రోక్‌ రావడంతో సహో ద్యోగులు గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కుమారుడి మరణవార్త విని శౌరమ్మ గుంటూరు జిల్లా నుంచి హైదరాబాద్‌ వచ్చింది. ఆయన మృతదేహాన్ని అంబులెన్స్‌లో జమాల్‌ పూర్‌కు తరలిస్తుండగా కారులో కూర్చున్న శౌరమ్మ గుండెపోటుకు గురైంది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గురువారం జమాల్‌పూర్‌లో తల్లీకొడుకులకు అంత్యక్రియల్ని నిర్వహించారు.

Advertisement
Advertisement