ఒకే కాన్పులో ముగ్గురి జననం | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 29 2018 11:50 AM

Mother Gives Birth 3 Babies At Once In Hyderabad - Sakshi

సాక్షి, సుల్తాన్‌బజార్‌: ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మంచిన సంఘటన శనివారం సుల్తాన్‌బజార్‌ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శైలజ తెలిపిన వివరాల ప్రకారం... ఇబ్రహీంపట్నం ఉప్పరిపల్లి గ్రామానికి చెందిన శ్రీశైలం భార్య మల్లీశ్వరి నెలలు నిండటంతో శనివారం రెండవ కాన్పు కోసం ప్రసూతీ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెకు సిజేరియన్‌ ఆపరేషన్‌ చేయడంతో ఆమెకు ఇద్దరు మగశిశువులు, ఆడశిశువు ఒకే కాన్పులో జన్మించారు.  వారు చిన్నపిల్లల విభాగంలోని అసోలేషన్‌ వార్డులో వైద్యుల పర్యావేక్షణలో ఉన్నారు.

Advertisement
Advertisement