రేకులగడ్డ (నిడమనూరు): కుటుంబ కలహాలో.. మరో కారణమో తెలియదు కానీ ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసి.. తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన రేకులగడ్డలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేగులగడ్డకు చెందిన నాయినాని గంగరాజుకు అదే మండలం వల్లభాపురానికి చెందిన లక్ష్మితో 14సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ప్రశాంత్(12), యమున(9) పిల్లలున్నారు. ఉన్నట్టుండి శనివారం సాయంత్రం 4,5 గంటల ప్రాంతంలో లక్ష్మి పురుగులమందు తాగి ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి గడియ వేసుకుంది. ఆమె మామ తలుపు తట్టి ఏమైందని అడిగితే చెప్పలేకపోయింది. అప్పుడే అపస్మారకస్థితిలోకి వెళుతున్న ఆమెను పిల్లలు ఏరి అని గట్టిగా అడిగితే బావిలో అంటూ.. ఆపై ఏమీ చెప్పలేకపోయింది. అనుమానం వచ్చి సమీపంలోని బావిలోకి వెళ్లి చూడగా చిన్నారుల మృతదేహాలు నీటిలో తేలియాడుతూ కనిపించాయి. గ్రామస్తులు వెంటనే బావిలోకి దిగి మృతదేహాలను వెలికితీశారు. అపస్మారకస్థితిలోకి వెళ్తున్న లక్ష్మిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
కన్నీటి పర్యంతమవుతున్న గ్రామస్తులు
బావిలో నుంచి తీసిన చిన్నారుల మృతదేహాలు చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యం తమవుతున్నారు. ప్రశాంత్కు ఇటీవలనే గురుకుల పాఠశాలలో సీటు వచ్చినట్లు గ్రా మస్తులు తెలిపారు. ఏ కోపం, ఆవేశం ఉన్నా బడ్డలను చంపుకుని ఇప్పుడు ఏం సా ధిస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని రాత్రి 9గంటలకు హాలియా సీఐ పార్థసారథి, నిడమనూరు ఎస్ఐ నర్సింహారాజు పరిశీలించారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
గతంలోనూ..
లక్ష్మి గతంలోనూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే అప్పుడు కుటుంబ సమస్యలు కావని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం సంఘబంధానికి సంబంధించిన రూ.25వేలు బ్యాంక్ నుంచి తీసుకుని ఆటోలో వస్తుండగా ఎక్కడో పడిపోయాయి. పోయిన రూపాయలు ఆచూకీ దొరకకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స చేయించడంతోప్రాణాలతో ఇంటికి వచ్చిందని, ఇప్పుడేమో ఇద్దరి పిల్లల ప్రాణాలు తీసి, తను కూడా తీసుకోబోయిందని రోదిస్తూ కుటుంబసభ్యులు చెప్పారు.
ఏం.. కష్టమొచ్చిందో..!
Published Sun, Jul 19 2015 12:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement