భూత్పూర్ (దేవరకద్ర) : తెలంగాణ ప్రజలు సాగు, తాగునీటి కోసం ఉద్యమించాలని సామాజికవేత్త, సీనియర్ జర్నలిస్టు పొన్నాల గౌరీశంకర్ అన్నారు. కృష్ణా– సావిత్రి నదుల పరిక్రమ సైకిల్ యాత్రను విజయవంతంగా పూర్తిచేసి భూత్పూర్ వచ్చిన సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. కృష్ణానది నీళ్లు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల జన్మహక్కు అన్నారు. దక్షిణ భారతదేశ రాష్ట్రాల పరిపాలన సౌలభ్యం కోసం రెండో రాజధానితోపాటు ఉప పార్లమెంట్, ఉప రాజ్యసభ, ఇతర కేంద్ర కార్యాలయాలు హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని కోరుతూ కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 6 వేల కి.మీ. సైకిల్యాత్ర చేపట్టానన్నారు. కృష్ణానది పుష్కరాల సందర్భంగా సైకిల్యాత్ర ప్రారంభించానని గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాల్లో మాతృభాషలో పరిపాలన జరగాలని, ప్రాంతీయ విభేదాలతో రెండు రాష్ట్రాలుగా విడిపోయిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, నియామకాలు, నీళ్లు సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. తాను కర్ణాటక, మహారాష్ట్రలో సైకిల్యాత్ర చేపడితే సైకిల్పై ఉన్న తెలుగు భాషతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర భాషల్లో బోర్డు రాసే వరకు తనను ఆయా రాష్ట్రాల్లో సైకిల్ యాత్ర చేపట్టనీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ చేపట్టిన సంకల్పన యాత్ర యావత్ ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా జరుగుతుందని, ప్రత్యేక హోదాపై చేస్తున్న పోరాటాలు చేయడం సరైందేనన్నారు. అనంతరం ఆయన శ్రీశైలానికి సైకిల్పై బయలుదేరి వెళ్లారు.
జడ్చర్లలో ఘన స్వాగతం..
జడ్చర్ల టౌన్ : పైరుపచ్చని తెలంగాణ సాధన, తెలుగును పరిపాలన భాషగా అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన జర్నలిస్టు గౌరీశంకర్ చేపట్టిన సైకిల్ యాత్ర శుక్రవారం జడ్చర్లకు చేరుకుంది. జడ్చర్ల ఫ్లైఓవర్ వద్ద సీఐ బాలరాజు ఆయనకు స్వాగతం పలికారు. పైరు పచ్చని తెలంగాణ రాష్ట్ర సాధననే తన యాత్ర ప్రధాన ఉద్దేశమన్నారు. నదుల అనుసంధానం ద్వారానే పైరుపచ్చని తెలంగాణ సాధ్యమని ప్రభుత్వం గుర్తించాలన్నారు. అందుకోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాటుపడాలన్నారు. అలాగే హైదరాబాద్ను దేశ రెండో రాజధానిగా చేయాలని, తద్వారా దక్షిణ భారతదేశానికి ప్రతిష్ట పెరుగుతుందన్నారు. దేశంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, జర్నలిస్టులకు జీతభత్యాలను ప్రభుత్వాలే ఇవ్వాలని, హెల్త్కార్డులు, అక్రిడిటేషన్ కార్డులను అందరికీ ఇవ్వాలని, పత్రికా రంగం విడిచిన వారికి పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. తన లక్ష్యాలు పూర్తయ్యే వరకు సైకిల్ యాత్ర కొనసాగిస్తానన్నారు. జడ్చర్ల నుంచి కర్నూలు, ఆత్మకూర్, శ్రీశైలం మీదుగా కల్వకుర్తి, హైదరాబాద్ వరకు ప్రస్తుత యాత్ర ముగిస్తానని ఆయన పేర్కొనన్నారు.
సాగునీటి కోసం ఉద్యమించాలి
Published Sat, Apr 7 2018 12:30 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement