పెరిగిన పెసర ధర | Sakshi
Sakshi News home page

పెరిగిన పెసర ధర

Published Mon, Sep 7 2015 6:26 PM

mrp increase to pesara crop

తిరుమలగిరి (నల్లగొండ): నల్లగొండ జిల్లా తిరుమలగిరిలోని వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం పెసరకు రికార్డు ధర పలికింది. క్వింటాల్‌కు రూ.7,669 ధర వెచ్చించి వ్యాపారులు కొనుగోలు చేశారు. సాధారణంగా రూ.5,000- రూ.7,000 పలికే ధర వారం రోజుల్లోనే వెయ్యికి పెరిగింది. సోమవారం మరింత ఎగబాకి రూ.7,669 గా నమోదైంది.

మార్కెట్‌కు 2,500 క్వింటాళ్ల పెసలు వచ్చాయి. అయితే, రికార్డు ధర పలకటంతో రైతులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవటంతో దిగుబడి తగ్గిందని, లేకుంటే మరింతగా దిగుబడులు మార్కెట్‌ను ముంచెత్తేవని అధికారులు అంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement