దుగ్గొండి :మహిళ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని సోమవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. కేసు వివరాలను నర్సంపేట రూరల్ సీఐ బోనాల కిషన్ వివరించారు. బిక్కాజిపల్లికి చెందిన కన్నెబోయిన రమకు ఇదే గ్రామానికి చెందిన తలబోయిన ఎల్లయ్యకు మధ్య నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈనెల 13న ఉదయం రమ భర్త సదయ్యకు దస్తగిరిపల్లిలోని తన అన్నయ్య వద్దకు వెళ్లాడు.
రమ సైతం గ్యాస్ పేపర్లు ఇవ్వడానికి దుగ్గొండికి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన రమ సాయంత్రం 4 గంట ల సమయంలో తలబోయిన ఎల్లయ్యకు ఫోన్లో మిస్డ్ కాల్ ఇచ్చింది. దీంతో ఆయ న మళ్లీ ఫోన్ చేశాడు. తనకు డబ్బులు కావాలని.. దుగ్గొండికి పట్టుకు రమ్మని చెప్పింది. తన వద్ద డబ్బులు లేవని ఎల్లయ్య చెప్పాడు. సాయంత్రం వరకు డబ్బులు.. ఓ బీర్ బాటిల్ను తీసుకుని శివాజినగర్ సమీపంలోని తన వ్యవసాయ బావి వద్దకు రావాలని చెప్పింది. దీంతో 4.30 గంటలకు ఎల్లయ్య వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు.
రమ రాకపోవడంతో ఆమె వచ్చే వరకు కెనాల్పై కూర్చున్నాడు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రమ రాగానే ఇద్దరు కలిసి వ్యవసాయ బావి గడ్డ వద్దకు వెళ్లారు. అక్కడే కూర్చొని రమ బీరు తాగింది. అనంతరం డబ్బులు ఏవి అని అడిగింది. లేవు.. రేపు ఇస్తాను అని ఎల్లయ్య చెప్పాడు. మాటామాటా పెరిగింది. నాలుగేళ్లుగా రూ.40వేలు ఇచ్చాను. ఇంకా డబ్బులు కావాలా అని ఇద్దరు గొడవ పడ్డారు. దీంతో రమ ఎల్లయ్య భార్యపై పలు ఆరోపణలు చేసింది. దీంతో ఎల్లయ్య ఆగ్రహంతో తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో కూర్చుని ఉన్న రమ మెడపై రెండుసార్లు నరికాడు.
అక్కడికక్కడే మృతి చెందిన రమను పక్కనే ఉన్న చిన్న పొద పక్కకు నెట్టాడు. మంగళసూత్రాలు, గొడ్డలి, సెల్ఫోన్, బ్యాంక్ పాస్బుక్, గ్యాస్ బుక్లను తీసుకుని సంఘటన స్థలానికి సమీపంలో మూడు ప్రదేశాల్లో వేర్వేరుగా దాచిపెట్టాడు. హత్య చేసిన మరుసటి రోజు ఉదయాన్నే పరారయ్యాడు. సోమవారం ఉదయం గ్రామానికి చేరుకుని పెద్దమనుషుల ముందు హత్యానేరాన్ని ఒప్పుకోగా పెద్దమనుషులతో కలిసి వచ్చి పోలీస్ స్టేషన్ లొంగిపోయాడు.
నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్కు పంపినట్లు సీఐ వివరించారు. సమావేశంలో ఎస్సై వెంకటేశ్వర్లు , ఏఎస్సై రఫాయిల్, పీసీలు శ్రీనివాస్, సక్రంనాయక్, దేవేందర్ పాల్గొన్నారు. కాగా, హత్య జరిగిన ముందు రోజు భార్యాభర్తలు కలిసి ఉండడం వల్ల డాగ్ వాసనపట్టి మృతురాలి భర్త వద్దకు వెళ్లినట్లు సీఐ వివరించారు.
హత్య కేసును ఛేదించిన పోలీసులు
Published Tue, Apr 21 2015 4:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement