ఈ నెల 8న శంకుస్థాపన {పభుత్వం సూత్రప్రాయ నిర్ణయం
హైదరాబాద్: నల్లగొండ జిల్లా తాగునీటి అవసరాలకు ఉద్దేశించిన నక్కలగండి ఎత్తిపోతల పథకానికి ఈ నెల 8న శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. గతంలో నిర్ణయించిన మాదిరి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) నుంచి కాకుండా నేరుగా శ్రీశైలం నుంచే 30 టీఎంసీల నీటిని తీసుకొని అప్పర్డిండికి తరలించేలా నూతన ప్రణాళికలను ఖరారు చేశారు. నిజానికి ఎస్ఎల్బీసీ నుంచి నీటిని తీసుకునే ప్రణాళిక ఎప్పటి నుంచో ఉన్నా ప్రభుత్వం దానికి ప్రత్యామ్నాయంగా ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ను చేపట్టి పూర్తిచేసింది. రెండింటి కింద ఆయకట్టు ఒకటే కావడంతో ఇప్పుడు ఎస్ల్బీసీతో ఎలాంటి సంబంధం లేకుండా శ్రీశైలం నీటిని వాడుకొని నక్కలగండి ప్రాజెక్టు చేపట్టాలని సంకల్పిస్తోంది. మొదటి డీపీఆర్ ప్రకా రం.. ఓపెన్ చానల్, టన్నెల్ల ద్వారా నక్కల గండి నుంచి మిడ్ డిండికి అక్కడి నుంచి ఎగు వ డిండికి నీటిని తరలించాలని నిర్ణయించారు.
ఈ డీపీఆర్ ప్రకారం ప్రాజెక్టులో భాగంగా మిడ్డిండి రిజర్వాయర్ భాగంగా ఉంటుంది. ఈ ప్రణాళికకు ప్రత్యామ్నాయంగా నక్కల గండి నుంచి గుట్టపైకి నీటిని తరలించి గ్రావిటీ ద్వారా పైప్లైన్ మార్గం గుండా నీటిని తరలించే అంశంపైనా అధ్యయనం జరిగింది. నక్కలగండి నుంచి కొండపైకి 960 మీటర్ల మేర నీటిని తరలించి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా లోయర్ డిండి వరకు 28 కిలోమీటర్ల మేర పైప్లైన్ ద్వారా నీటిని తరలించేందుకు రూ.1500 కోట్ల మేర భారం పెరుగుతుండడంతో దాన్ని పక్కనపెట్టారు. తాజాగా మరోమారు ప్రాజెక్టుపై రీ ఇంజనీరింగ్ చేసిన అధికారులు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు మాదిరే శ్రీశైలం నుంచి నిర్ణీత 30 టీఎంసీల నీటిని తీసుకోవాలని సంకల్పించారు.శ్రీశైలం నుంచి నేరుగా ఎగువ డిండి కి నీటిని తరలి స్తారు అక్కడి నుంచి కాల్వ ల ద్వారా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల తాగు, సాగు అవసరాలు తీరుస్తారు. కల్వకుర్తి కింద లేని 50 వేల ఎకరాల ఆయకట్టును నక్కలగండితో నీటిని అందిస్తారు. ఈ మొత్తం ప్రాజెక్టు దాదాపు రూ.5,500 కోట్ల మేర వ్యయం కావచ్చని అధికారుల అంచనా.
నక్కలగండికి శ్రీశైలం నీరే!
Published Wed, Jun 3 2015 1:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement