Sakshi News home page

సౌదీలో నల్గొండ వాసి ఆత్మహత్య

Published Mon, Mar 7 2016 6:22 PM

nalgonda youth suicide in saudi arabia

నల్గొండ జిల్లా: బతుకుదెరువు కోసం సౌదీకు వెళ్లిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం బొప్పారం గ్రామానికి చెందిన మహ్మద్ మాజూ(26) 9 నెలల కిందట సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడ అల్‌హట్టా రాష్ట్రం అల్‌సుఖ్‌ఖీ గ్రామంలో మాజూ ఓ షేక్‌కు చెందిన ఖర్జూర తోటలో పనిచేస్తున్నాడు. ఆ తోటలో అతను అనూహ్యంగా చెట్టుకు ఉరివేసుకుని మరణించాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పొట్టకూటి కోసం విదేశీలకు వెళ్లిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడటంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement