సాక్షి, ఖమ్మం: అటవీ శాఖ నిర్లక్ష్యం వల్లే తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు సాగడం లేదని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ చట్టాలపై ఆ శాఖ అధికారులు దృష్టి సారించి పరిష్కారానికి మార్గాలు చూపాలని కోరారు. పార్లమెంట్లో మంగళవారం ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. పర్యావరణ అనుమతుల్లో నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవుతోందన్నారు.
నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నా అటవీ శాఖ అలసత్వం వల్ల ప్రాజెక్టుల పనులు ముందుకు సాగడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం పాలకులు ఈ అంశంపై దృష్టి సారించగలిగితే నిలిచిపోయిన ప్రాజెక్టులు పూర్తకావడంతోపాటు జాతీయ ఉత్పత్తి పెరిగి, దేశం ఆర్థికంగా బలోపేతమవుతుందన్నారు. ఇప్పటికైనా ఈ చట్టాల అమలుకు పూనుకోవాలని, ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. సరిహద్దు రాష్ట్రాలు వద్దు మొర్రో అంటున్నా వారి వాదనను వినిపించుకోకుండా పోలవరం బిల్లును ఆమోదించారన్నారు.
ఏళ్ల తరబడి తెలంగాణ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. నదుల అనుసంధానం కోసం సర్ ఆర్థర్ కాటన్ చేసిన ప్రయత్నాలను పొంగులేటి కొనియాడారు. కృష్ణ, గోదావరి, కావేరి నదులపై ప్రాజెక్టులు నిర్మించాలనే సర్ ఆర్థర్కాటన్ చిరకాల కోరికను ప్రస్తుత పాలకులైనా నెరవేర్చాలన్నారు. అలాగే బిందు సేద్యంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ విధానం వల్ల తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించుకుని రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడంతోపాటు ప్రభుత్వానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
గోదావరి నుంచి తెలంగాణ ప్రాంతానికి సాగునీటి కోసం ఏర్పాటు చేసిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై దృష్టి సారించాలని కోరారు. ఈ ప్రాజెక్టులో 30 అడుగుల మేర పూడిక ఉందని, దీని వల్ల తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. వీలైనంత త్వరగా శ్రీరాంసాగర్లో పూడికతీత కార్యక్రమం చేపట్టాలని, అందుకు సరిపడా నిధులను కేటాయించాలని కోరారు. ప్రస్తుత సీజన్లో వరద ముంపులో ఉన్న ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు బాధితులకు ముందుగానే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వరద బీభత్సంతో నష్టపోయిన రైతులకు ప్రత్యేక పథకం ఏర్పాటు చేసి బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు.
అటవీ శాఖ నిర్లక్ష్యంతోనే ప్రాజెక్టులు ఆలస్యం
Published Wed, Jul 23 2014 2:25 AM
Advertisement
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
ఆ గట్టున సినిమా స్టార్లు.. ఈ గట్టున రియల్ స్టార్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Fact Check: చంద్రబాబుకోసమే... రామోజీ నేలబారు రాతలు!
అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
సింహాచలం ఆలయంలో భక్తుల రద్దీ
అభివృద్ధి లేదంటూ అసత్య ప్రచారం.. కారణం ఇదే..
'అక్షయ తృతీయ' అనే పేరు ఎలా వచ్చింది? బంగారం కొనాల్సిందేనా..?
కిక్కిరిసిన కర్నూల్
డైరెక్ట్గా ఓటీటీకి టాలీవుడ్ సస్పెన్ష్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
"కూటమి కట్టినా ఓటమి తప్పదు"
చెలరేగిన కోహ్లి, పటిదార్ 60 పరుగులతో బెంగళూరు ఘనవిజయం (ఫొటోలు)
తప్పక చదవండి
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- సీమలో తు‘ఫ్యాన్’
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- అది పెత్తందార్ల కూటమి: సీఎం జగన్
Advertisement