Sakshi News home page

ఏపీ రాజధానికి కొత్త మాస్టర్ ప్లాన్

Published Sat, Feb 28 2015 2:44 AM

ఏపీ రాజధానికి కొత్త మాస్టర్ ప్లాన్ - Sakshi

సింగపూర్ మంత్రి షణ్ముగం  అభిషేక సేవలో శ్రీవారి దర్శనం
 సాక్షి,తిరుమల: ఏపీ కొత్త రాజధానికి సరికొత్త హంగులతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని సింగపూర్ మంత్రి షణ్ముగం అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన అభిషేక సేవలో మంత్రి నారాయణతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు. తమ దేశంలోని ఓ సంస్థ ఈ మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తోందని, దీన్ని జూన్ నెలాఖరులో అందజేస్తామన్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.  మంత్రి నారాయణ మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్ సజావుగా సాగుతోందని, ఇప్పటి వరకు 25,200 ఎకరాలు పూర్తి అయ్యిందన్నారు.
 

Advertisement
Advertisement