గజ్వేల్: కార్తెలు కరిగిపోతున్నా... వర్షాలు సక్రమంగా లేక జిల్లాలో సాగు సాగడం లేదు. దీంతో ఈ సారి ప్రత్యామ్నాయ పంటల సాగు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. మరో వారంరోజుల్లో భారీ వర్షాలు రావొచ్చని, ఈలోగా విత్తనాలు వేసినా ప్రయోజనం ఉంటుందని చెబుతూనే... వ్యవసాయశాఖ ఎందుకైనా మంచిదని ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేయడానికి సన్నద్ధమవుతోంది. కాలం కలిసోస్తుందనుకుంటే పరిస్థితి అందుకు భిన్నంగా మారటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో 4.40 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గానూ ఈసారి 5.2 లక్షల హెక్టార్లలో పంటల సాగువుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ వర్షాలు లేక పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. జూన్, జూలై నెలల్లో మొత్తం 281 మి.మీల సాధారణ వర్షపాతానికి గానూ ఇప్పటి వరకు 122 మి.మీల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఫలితంగా పంటల పరిస్థితి దయనీయంగా మారింది. మొత్తంగా 2.57లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగులోకి వచ్చాయి. పత్తికి సంబంధించి ఒక్కొక్క రైతు రెండు నుంచి మూడుసార్లు పంటను చెడగొట్టారు.
పత్తి పంటల విత్తనాలు, పెట్టుబడుల రూపంలో జిల్లావ్యాప్తంగా రూ.40 కోట్ల నష్టం వాటిల్లింది. మొక్కజొన్న విషయంలోనూ ఇదే రకమైన పరిస్థితి నెలకొనగా రూ. కోట్లల్లో పంట నష్టం జరిగింది. ఇక జిల్లాలో గరిష్టంగా సాగయ్యే వరి ఈ సారి ఇంకా మడుల్లోనే ఉండిపోయింది. ప్రతి ఏటా సమారు లక్ష హెక్టార్లలో సాగయ్యే ఈ పంట ప్రస్తుతం 22 వేల పైచిలుకు హెక్టార్లకే పరిమితమైంది.
భారీ వర్షాలకు అవకాశం ఉంది: హుక్యానాయక్
వారం రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు చెబుతున్నారని వ్యవసాయశాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ హుక్యా నాయక్ తెలిపారు. బుధవారం గజ్వేల్ వ్యవసాయ సబ్డివిజన్ పరిధిలోని గజ్వేల్, జగదేవ్పూర్ మండలాల్లో పంటల పరిస్థితిపై క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వారంలోపు వర్షాలు కురిసిన పత్తి, మొక్కజొన్న లాంటి పంటలు వేసుకోవచ్చని చెప్పారు.
ఆగస్టు మొదటి వారం కూడా వర్షాలు రాకపోతే పొద్దుతిరుగుడు, ఆముదం, కూరగాయలు వంటి ఆరుతడి పంటల సాగు కోసం కార్యాచరణ సిద్ధం చేస్తామని చెప్పారు. వాతావరణ ప్రతికూల పరిస్థితులపై రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ప్రత్యామ్నాయమేనా?
Published Wed, Jul 23 2014 11:50 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement