వికలాంగుల పరికరాలపై జీఎస్టీ వద్దు | Sakshi
Sakshi News home page

వికలాంగుల పరికరాలపై జీఎస్టీ వద్దు

Published Tue, Jun 27 2017 1:51 AM

No GST Disabled devices

సాక్షి, హైదరాబాద్‌: వికలాంగులకు అవసరమైన పరికరాల కొనుగోలుపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని వికలాంగుల హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

దేశ జనాభాలో వికలాంగులు 5శాతం ఉన్నారని, వారిలో దాదాపు 5కోట్ల మంది బ్రెయిలీ పేపర్, వాచ్‌లు, ఆర్థోపెడిక్‌ పరికరాలు, ఇతర మిషన్లు వినియోగిస్తున్నారన్నారు. వీటిపై కేంద్రం 18శాతం జీఎస్టీ విధించడంతో వారు ఇబ్బందిపడతారన్నారు. ఈమేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement