సాక్షి, హైదరాబాద్: ‘నీట్’ర్యాంకుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ తదితర మెడికల్ కాలేజీల్లోని పీజీ, యూజీ వైద్య సీట్లకు ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహించాలన్న నిర్ణయంపై రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీలు తీవ్రంగా వ్యతిరే కిస్తున్నాయి. దీనివల్ల తమకు బోలెడంత నష్టం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాయి. అయితే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) సహా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వారికి స్పష్టం చేసినట్లు తెలిసింది. పైగా కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి కౌన్సెలింగ్పై ఇటీవల స్పష్టమైన ప్రకటన జారీ అయిన వెంటనే పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేశాయని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాగే ముందుకు వెళుతుందని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.
వైద్య ఫీజుల పెంపునకు డిమాండ్
ఉమ్మడి కౌన్సెలింగ్ తప్పనిసరైతే పీజీ వైద్య ఫీజులను పెంచాలని ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. మంత్రి లక్ష్మారెడ్డితో మెడికల్ కాలేజీ యాజమాన్యాలు బుధవారం సమావేశమై.. ఫీజుల పెంపు, ఉమ్మడి కౌన్సెలింగ్పై చర్చ జరిపాయి. ఫీజుల పెంపునకు ప్రభుత్వం కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే గతేడాది 10 శాతం పెంచినందున ఈసారి అంతకుమించి పెంచాలని యాజమాన్యాలు కోరుతున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా క్లినికల్ సీట్లకు రూ. 3.2 లక్షలు, యాజమాన్య కోటాలోని క్లినికల్ కోటా సీట్లకు రూ. 5.8 లక్షలు ఫీజులున్న సంగతి తెలిసిందే. అయితే డొనేషన్ల పేరుతో యాజమాన్యాలు పీజీ సీట్లకు రూ. కోటి నుంచి రూ. కోటిన్నర వరకు వసూలు చేస్తున్నాయి. ఒక్కోసారి రూ. 2 కోట్లు కూడా వసూలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైవేటు, మైనారిటీ కాలేజీల్లో దాదాపు 700 పీజీ వైద్య సీట్లున్నాయి.
ఎన్ఆర్ఐ సీట్లకూ ఉమ్మడి కౌన్సెలింగే..
ఈసారి ప్రవాస భారతీయ (ఎన్ఆర్ఐ) కోటాలోని 15 శాతం ఎంబీబీఎస్ సీట్లకు కూడా ఉమ్మడి కౌన్సెలింగ్ వర్తిస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. గతేడాది ఈ సీట్లను కూడా ‘నీట్’ర్యాంకుల ఆధారంగా ప్రైవేటు యాజమాన్యాలే కౌన్సెలింగ్ లేకుండా ఇష్టానుసారంగా భర్తీ చేసుకున్నాయి. అయితే ఈసారి నుంచి నీట్ ర్యాంకుల ఆధారంగా బీ కేటగిరీ సీట్లతో సమానంగా ఎన్ఆర్ఐ సీట్లనూ ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారానే వీటిని భర్తీ చేయాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఉమ్మడి కౌన్సెలింగ్కు సంబంధించి పీజీ, యూజీలకు వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేస్తుందని ఆయన వెల్లడించారు.
ఉమ్మడి కౌన్సెలింగ్ వద్దు
Published Fri, Mar 17 2017 3:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement