* ఉమ్మడిగా ఉన్నప్పుడు కొనసాగిన పంథానే ఇంకానా...
* సురేశ్ప్రభు ఎదుట సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విషయంలో రైల్వే శాఖ చిన్నచూపు చూస్తోందని సీఎం కేసీఆర్ రైల్వే మంత్రి సురేశ్ప్రభు ఎదుట అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగినట్టుగానే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వెలిబుచ్చారు. సోమవారం సచివాలయంలో తనను కలిసిన సురేశ్ప్రభుతో తెలంగాణ రైల్వే డిమాండ్లపై కేసీఆర్ చర్చించారు. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు ఒక్క ప్రాజెక్టును కూడా కేటాయించలేదని గుర్తుచేశారు. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ కేటాయింపు అంశాన్ని పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచినా ఇప్పటి వరకు ప్రకటించలేదని, మంజూరు చేసిన వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించటం లేదని ఫిర్యాదు చేశారు. చివరకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్ప్రెస్గా మార్చాలని కోరినా పట్టించుకోలేదని విమర్శించారు.
ఈ సందర్భంగా పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త ప్రతిపాదనలు, రైల్వేతో పేచీలకు సంబంధించిన వివరాలతో కూడిన జాబితాను సురేశ్ప్రభుకు అందించారు. అలాగే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్పై రైల్వేట్రాఫిక్ ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో నగర శివార్లలోని మౌలాలి, నాగులపల్లి స్టేషన్లను రైల్వే టెర్మినళ్లుగా మార్చాలని సురేశ్ప్రభును కేసీఆర్ కోరారు. సీఎం డిమాండ్లపై సాను కూలంగా స్పందించిన రైల్వే మంత్రి త్వరలోనే హైదరాబాద్లో పెండింగ్ ప్రాజెక్టులపై సమావేశం నిర్వహిస్తానని హామీ ఇచ్చారు.
పెండింగ్ ప్రాజెక్టుల జాబితా
- రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా కాజీపేటలో కోచ్ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేయడంతోపాటు కాజీపేటను డివిజన్గా ప్రకటించాలి. కాజీపేటకు మంజూరైన వాగన్వీల్ ఫ్యాక్టరీ పనులను వెంటనే మొదలుపెట్టాలి.
- పెద్దపల్లి-కరీంనగర్-జగిత్యాల-నిజామాబాద్ (178 కి.మీ.) లైనులో మిగిలిన పనిని వేగంగా పూర్తిచేయాలి. (భూసేకరణలాంటి పనులకు రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే నిధులు డిపాజిట్ చేసింది)
- మనోహరాబాద్-కొత్తపల్లి ప్రాజెక్టులో యాన్యుటీ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినందున దాన్ని వెంటనే చేపట్టాలి.
- అక్కన్నపేట-మెదక్ లైన్కు రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేసినందున దాన్ని వెంటనే చేపట్టాలి.
- భద్రాచలం-సత్తుపల్లి కొత్త లైనును సకాలంలో పూర్తిచేయాలి.
- మంచిర్యాల-పెద్దంపేట ట్రిప్లింగ్ పనులు
- కాజీపేట-విజయవాడ మూడో లైను ఎలక్ట్రిఫికేషన్
- రాఘవాపూర్-మందమర్రి ట్రిప్లింగ్
- మణుగూరు-రామగుండం కొత్త లైను
- సికింద్రాబాద్-మహబూబ్నగర్ డబ్లింగ్
- సికింద్రాబాద్-జహీరాబాద్ డబ్లింగ్
- పగిడిపల్లి-శంకర్పల్లి సర్వే
కొత్త ప్రతిపాదనలు:
- గద్వాల-మాచెర్ల బ్రాడ్గేజ్ లైను
- పాండురంగాపురం-భద్రాచలం లైను
- వరంగల్లో రైల్వే విశ్వవిద్యాలయం ఏర్పాటు
- 15 ప్రాంతాల్లో కొత్తగా ఆర్ఓబీ/ఆర్యూబీల మంజూరు
ఒక్క ప్రాజెక్టన్నా ఇచ్చారా?
Published Tue, Jan 20 2015 12:45 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement